గుత్తి కోయిల పై ఫారెస్ట్ అధికారుల దాడి,
–వారిని చేరదీసి క్వింటా బియ్యం అందించిన అంకం పల్లి సర్పంచ్ వట్టం సావిత్రి బాలరాజు
(ములుగు జిల్లా విజయం న్యూస్):-
ములుగు జిల్లా, యస్,యస్, తాడ్వాయి మండలం ,అంకం పల్లి గ్రామ పంచాయితీ పరిధిలో కౌషెట్టి వాయి గ్రామం పరిధిలో అటవీ ప్రాంతంలో ఉన్న గుత్తికోయ లపై ఫారెస్ట్ అధికారులు గత పది రోజుల క్రితం దాడి చేసి ఇండ్లను నిప్పంటించి దగ్ధం చేశారు. అది తెలుసుకొని స్థానిక సర్పంచ్ వట్టం.సావిత్రి బాలరాజు గ్రామం వద్దకు తీసుకుని రెండు గుడిసెలు వేసి వారిని అందులో ఉంచి బియ్యాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
also read :-కే టిఆర్ కుఘన స్వాగతం పలికిన ప్రతినిధులు
గత ఎన్నో సంవత్సరాల నుండి వీరు నివసిస్తున్నారని, ఫారెస్ట్ అధికారులు అక్కడికి వచ్చి గొత్తి కోయలపై దాడి దురదృష్టకరమన్నారు.
గోత్తి కోయాలపై దాడి సరి కాదని అన్నారు.వారు ఉండడానికి రెండు గుడిసెలు వేసి , మరియు 2 క్వింటల్ల బియ్యం, కూ రగాయలు పంపిణీ చేశారు. దీనిపై ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.