నువ్వు హీరోవి కాదు దేవుడివి. షూటింగ్ కోసం కట్టిన ఇళ్ళు పేదలకు ఇచ్చాడు.. !!
మణుగూరు రూరల్ విజయం న్యూస్
నువ్వు హీరోవి కాదు దేవుడివి. షూటింగ్ కోసం కట్టిన ఇళ్ళు పేదలకు ఇచ్చాడు.. !!
(మణుగూరు రూరల్ విజయం న్యూస్): –
సెలబ్రెటీలు ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉంటారు.పేదల కోసం, పిల్లల కోసం తమకు తోచిన సాయం చేస్తూనే ఉంటారు. కొందరు ఉచితంగా వైద్యం అందిస్తూటే. మరికొందరు విద్య, ఆహారము వంటివి అందిస్తున్నారు.
ఇప్పటికీ చాలా మంది సెలబ్రెటీలు ఆపదలో ఉన్న అనేక మందిని ఆదుకున్నారు. అయితే తాజాగా ఒక ప్రముఖ హీరో కొందరు పేదలకు చేసిన సాయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అతనెవరో కాడు తమిళ సూపర్ స్టార్ సూర్య..సూర్య మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. తాజాగా తను నటిస్తున్న సినిమా కోసం వేసిన సెట్ ను పేదలకు ఇచ్చారు.షూటింగ్ కోసం నిర్మిస్తున్న ఇళ్లను ను పేద మృత్యు కారులకు ఉచితంగా అందించాలని సూర్య నిర్ణయం తీసుకున్నారు.
also read :-కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి
బాలా దర్శకత్వంలో, సూర్య నటిస్తున్న. చిత్రం షూటింగ్ ప్రస్తుతం కన్యాకుమారిలో జరుగుతుంది.షూటింగ్ కోసం జాలర్లు నివసించే గుడిసెల తరహాలో భారీ ఖర్చుతో ఇళ్లను నిర్మించారు.అయితే అక్కడ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక.వాటిని కూల్చి వేయకుండా.ఇల్లు లేని నిరుపేద మృత్యు కారులకు ఇవ్వాలని సూర్య నిర్ణయించుకున్నారు.ఎంతో శ్రమతో ఖర్చుతో నిర్మించిన ఇళ్లను కూల్చివేయడం కుండా వాటిలో కొన్ని పేద కుటుంబాల కైనా నీడ కల్పించాలని.సూర్య అనుకున్నారు.దీంతో సూర్య చేసిన ఈ ఆలోచనను. ఆశయాన్ని నా అభిమానులు, ఆ ప్రాంతంలోని ప్రజలు అభినందిస్తున్నారు. సూర్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
also read :-పల్లా యువసేన ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం .
ఇటీవలే సూపర్ హిట్ అయినా సూర్య సినిమా జై భీమ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమా సమయంలో కూడా సూర్య.తన గొప్ప మనసుతో చాటుకున్నాడు.జై భీమ్ సినిమా తో అందరికీ తెలిసిన.రియల్ సినతల్లికు అమ్మళ్ కు సూర్య ఆర్థిక సహాయం చేశాడు. అమ్మళ్ పేరుతో బ్యాంకులో 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అంతేకాకుండా దాని నుంచి వచ్చే నెలవారీ వడ్డీని అమ్మళ్ కు అందేలా సూర్య చేశాడు. అయితే ఈ అమ్మళ్ జీవితంలో లో జరిగిన సంఘటన ఆధారంగా జై భీమ్ అనే సినిమా తెరకెక్కింది.
మరోవైపు మలయాళం అగ్ర నటుడు మోహన్ లాల్ కూడా తన మంచి మనసును చాటుకొంన్నారు. పేద విద్యార్థులకు ఆయన అండగా నిలిచారు. మోహన్ లాల్ 20 మంది పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. విశ్వశాంతి పౌండేషన్ సహకారంతో అట్లపాడికి చెందిన గిరిజన బాలలను ఎంపిక చేసి 15 ఏళ్ల పాటు వారిని చదివించనున్నట్లు. మోహన్ లాల్ తెలిపారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.