Telugu News

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన ఏపీ సర్కార్..ఎంతంటే..?

హర్షం వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రజలు

0

*ఏపీ వాహనదారులకు జగన్ శుభవార్త..!*
*పెట్రోల్ రూ.1.51లు, డీజిల్ రూ.2.22లు తగ్గింపు.*

(అమరావతి-విజయం న్యూస్)

కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీ తో ఏపీ లోనూ పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది జగన్ సర్కార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ పెట్రోల్‌ పై రూ.1.51, డీజిల్‌పై రూ. 2.22 మేర వ్యాట్‌ తగ్గింది.

ఈ నిర్ణయంతో డీజిల్‌పై ఏడాదికి రూ. 888 కోట్లు, పెట్రోల్‌పై రూ. 226 కోట్ల మేర వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గనుంది.

కేంద్రం తగ్గించిన ఎక్సైజు డ్యూటీ అనంతరం ఏపీలో డీజిల్ పై రూ. 8.68, పెట్రోలుపై రూ. 4.85 కు వ్యాట్ తగ్గింది.

ఏడాదికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగం అవుతోంది.

దీంతో వినియోగదారులకు రూ. 226 కోట్ల మేర లబ్ది కలుగు తుందని పేర్కొంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏడాదికి 400 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం అవుతోంది.

ఇక తాజా వ్యాట్ తగ్గింపుతో 888 కోట్ల రూపాయల మేర లబ్ది ఉందని చెబుతోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

మొత్తంగా ఏడాదికి రూ. 1114 కోట్ల మేర ఏపీ సర్కార్ నష్టం వాటిల్లనుంది.

Allso read :- తిరుమల- పాపవినాశనం రోడ్డు మూసివేత