వరసగా 9వ రోజు పెట్రో బాధుడు
== ధరలను పెంచుతూనే ఉన్న చమురు సంస్థలు
(హైదరాబాద్-విజయంన్యూస్);-
పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం మరోసారి పెరిగాయి. బుధవారం నాటి ధరల కంటే ఈరోజు పెట్రోల్, డీజిల్లపై లీటరుకు 80 పైసలు పెరిగింది. ఇంధన ధరల్లో గురువారం మార్పుతో ఢల్లీిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.81కి అమ్ముడవుతోంది. మరోవైపు దేశ రాజధానిలో డీజిల్ 80 పైసలు పెరిగి లీటరుకు రూ. 93.07గా ఉంది.37 రోజుల విరామం తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల రోజువారీ సవరణను ప్రారంభించింది. 2022 మార్చి 22వతేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుపై రూ. 6.40 చొప్పున పెంచారు.
also read :-కేంద్రంతో ప్రత్యక్షపోరాటంలో టిఆర్ఎస్
పెట్రోల్, డీజిల్ ధరలు చివరి సవరణ గత ఏడాది నవంబర్ 4వతేదీన జరిగింది.త ఏడాది నవంబర్ 4వ తేదీ నుంచి గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి.రష్యా`ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారతదేశంలో ప్రతీరోజూ పెట్రో ధరలు పెరుగుతుండటంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది.