అవి బంతులా.. బుల్లెట్లా?
గుజరాత్ బ్యాటర్లు బెంబేలు
గుజరాత్పై 5 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ మాలిక్
ఇందులో నలుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్
కానీ.. మ్యాచ్లో ఓడిపోయిన హైదరాబాద్
ఐపీఎల్ 2022లో ఫాస్టెస్ట్ బౌలర్గా నిలిచిన మాలిక్
(ముంబయి-విజయంన్యూస్);-
ఐపీఎల్ 2022 సీజన్లో ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ వేగంతో నిప్పులు చెరుగుతున్నాడు. ప్రత్యర్థి టీమ్ బ్యాటర్లు అతని వేగానికి భయపడి.. స్టంఫ్లను వదిలేసి ఆడుతున్నారు. కానీ.. ఏం జరుగుతోందంటే? ఐపీఎల్లో ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో గత ఏడాది వరకూ విదేశీ క్రికెటర్లే ఎక్కువగా కనిపించేవారు. మచ్చుకకి జాబితాలో వెతికినా.. భారత క్రికెటర్లు ఎక్కడో 9-10 స్థానాల్లో దర్శనమిచ్చేవారు. కానీ.. గత ఏడాది ఉమ్రాన్ మాలిక్ రాకతో భారతీయులు కూడా సగర్వంగా మాకూ ఓ ఫాస్టెస్ట్ బౌలర్ ఉన్నాడని చెప్పుకున్నారు. అయితే.. ఈ ఏడాది మా బౌలరే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ బౌలర్ అని కాలరెగరేసే స్థాయికి ఉమ్రాన్ మాలిక్ చేర్చాడు. ఎంతలా అంటే? సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కి ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్ గంటకి 150కిమీ వేగంతో బంతులు వేయడం చాలా కామన్గా మారిపోయింది.
also read :-కోహ్లీ డ్యాన్స్
అతను వేసే వేగవంతమైన యార్కర్లకి భయపడి.. బ్యాటర్లు వికెట్లని వదిలేసి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బౌల్డ్ అవుతున్న ఆటగాళ్ల సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతోంది. గుజరాత్ టైటాన్స్తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో గంటకి 145-153 కిమీ వేగంతో బంతులు వేసిన ఉమ్రాన్ మాలిక్.. ఆ జట్టు బ్యాటర్లని బెంబేలెత్తించేశాడు. మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్ మాలిక్ కేవలం 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఐదు వికెట్లలో నలుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్గా వెనుదిరగడం మాలిక్ భీకర పేస్కి నిదర్శనం. కానీ.. ఈ మ్యాచ్లో ఆఖరికి సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
also read :-క్యాన్సర్ ఆస్పత్రిని జాతికి అంకితం చేసిన ప్రధాని
చివరి ఓవర్లో జాన్సెన్ పేలవ బౌలింగ్ కారణంగా హైదరాబాద్కి నిరాశ తప్పలేదు. అయితే.. గుజరాత్ కోల్పోయిన ఐదు వికెట్లనీ ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే తీయడం గమనార్హం. గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్ వికెట్లకి దూరంగా జరిగి.. ఉమ్రాన్ మాలిక్ని ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. గంటకి 144.2కిమీ వేగంతో దూసుకెళ్లిన బంతి ఆఫ్ స్టంఫ్ని ఎగరగొట్టింది. ఆ తర్వాత ఉమ్రాన్ మాలిక్ గంటకి 145.6కిమీ వేగంతో విసిరిన బంతిని కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. వేగాన్ని మ్యాచ్ చేయలేకపోవడంతో ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేచిపోగా.. జాన్సెన్ క్యాచ్ అందుకున్నాడు. అనంతరం మరో ఓపెనర్ సాహా కూడా వికెట్లని వదిలేసి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే.. ఈసారి తన వేగం మరింత పెంచిన ఉమ్రాన్ మాలిక్ 152.8 కిమీ వేగంతో యార్కర్ని విసిరాడు. దాంతో.. ఆ బంతిని సాహా కనీసం టచ్ కూడా చేయలేకపోగా.. బంతి వెళ్లి మిడిల్ స్టంప్ని గీరాటేసింది.
also read ;-చర్లలో లొంగిపోయిన మహిళా మావోయిస్టులు
పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ కూడా ఉమ్రాన్ మాలిక్ వేగానికి తట్టుకోలేకపోయాడు. గంటకి 148.7కిమీ వేగంతో వేసిన బంతిని మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోగా.. బంతి వెళ్లి మిడిల్ స్టంప్ని ఎగరగొట్టింది. ఇక ఆఖరిగా అభినవ్ కూడా ఉమ్రాన్ మాలిక్ పేస్కి బలయ్యాడు. స్టంప్ లైన్పై గంటకి 146.3కిమీ వేగంతో వెళ్లిన బంతి ఆఫ్ స్టంఫ్ని ఎగరగొట్టింది. దాంతో.. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్లో నలుగురు బ్యాటర్లని బౌల్డ్ చేసిన మూడో బౌలర్గా మాలిక్ నిలిచాడు. ఇప్పటి వరకూ లసిత్ మలింగ, ఎస్ త్రివేదీ మాత్రమే ఈ ఘనత సాధించారు.