Telugu News

డిఎస్‌ చేరికకు లైన్‌ క్లీయర్‌

 ఈనెల 24న ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

0

డిఎస్‌ చేరికకు లైన్‌ క్లీయర్‌
 ఈనెల 24న ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
(నిజామాబాద్‌-విజయంన్యూస్);-
పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈనెల 24న ఢల్లీిలో ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అగ్రనేతలు ఇందుకు పిసిసికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. డిఎస్‌ రాకతో కాంగ్రెస్‌ బలపడగలదన్న భావనలో ఉన్నారు. సుమారు రెండేళ్ల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహారాలకు డీఎస్‌ దూరంగా ఉంటున్నారు.

also read :-కూసుమంచిలో హాస్పిటల్ ను ప్రారంభించిన ఎంపీపీ

ఇటీవల ఆయన ఢల్లీిలో సోనియాగాంధీతో సమావేశం కావడంతో డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖరారైంది. 2015లో బంగారు తెలంగాణ లక్ష్యంగా డీఎస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2016 జూన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా డీఎస్‌ పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 21న ముగియనుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీలో డీఎస్‌ చేరికను ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తు న్నారు. జగ్గారెడ్డి వంటి నేతలు ఇప్పటికే డీఎస్‌ చేరిక వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా డీఎస్‌ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్‌ గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. డిఎస్‌ వచ్చినా పెద్దగా ప్రభావం ఉండదని కొందరు బావిస్తున్నారు.