ఇలాంటి కేసులు మన తెలుగు రాష్ట్రంలో నమోదు కావాలి..!
నా చిలుక ఎగిరిపోయింది సార్ !
ప్రేమగా పెంచుకున్న రామచిలుక మోసం చేసి ఎగిరిపోయిందని మనీశ్ ఠక్కర్ పోలీసులను ఆశ్రయించాడు.
ఎలాగైనా వెతికిపెట్టాలని కోరాడు.
ఇతని ఫిర్యాదుతో చిలుకను వెదకడం మొదలుపెట్టిన పోలీసులు నగరంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా జగదల్పుర్లో ఈ మిస్సింగ్ కేసు నమోదైంది.
ఏడేళ్లుగా కుటుంబసభ్యురాలిలా చిలుకను పెంచుకొంటున్నట్లు మనీశ్ ఫిర్యాదులో వివరించాడు.
గత గురువారం పంజరం తెరవగానే ఎగిరిపోయిందని, మళ్లీ వెనక్కి తిరిగి రాలేదని తెలిపాడు.