సీఎల్పీనేత భట్టి విక్రమార్క ను కలిసిన పొంగులేటి
** పొంగులేటితో పాటు పిడమర్తి రవి, బ్రహ్మయ్య
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోలుకుంటున్నారు.
ఇది కూడా చదవండి:- కోలుకుంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క*
కాగా గురువారం పాదయాత్ర చేస్తుండగా అస్వస్థత గురైనా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10.30గంటలకు నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలో పాదయాత్ర శిబిరం వద్దకు వచ్చి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని, తిరిగి పాదయాత్ర చేయాలని ఆకాంక్షించారు. మండుటెండలో పాదయాత్ర చేస్తున్నందుకు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలు కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకుడు బెల్లయ్య నాయక్, రాంచందర్ నాయక్, పీసీసీ సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, వడ్డె నారాయణరావు, శ్రీనివాస్ రెడ్డి, ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి, తాళ్ళూరి బ్రహ్మయ్య, హ తదితరులు హాజరైయ్యారు.
ఇది కూడా చదవండి:- భట్టి విక్రమార్క అభిమన్యుడు కాదు అర్జునుడు