Telugu News

పంజాబ్ లో ఈడీ సోదాల కలకలం

== సిఎం చరణ్‌జీత్‌ సింగ్‌ బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు

0

పంజాబ్ లో ఈడీ సోదాల కలకలం
== సిఎం చరణ్‌జీత్‌ సింగ్‌ బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
== ఎన్నికల కుట్రలో భాగమంటున్న సీఎం చరణ్ జిత్..
== బీజేపీపై కాంగ్రెస్‌ విమర్శలు
(చండీగఢ్‌-విజయంన్యూస్)
పంజాబ్ రాష్ట్రంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి.. అతి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఏకంగా రాష్ట్ర సీఎం బందువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది.. ఇది కచ్చితంగా ఎన్నికల కుట్రలో భాగంగానే దాడులు జరుగుతున్నాయని, ఎలాంటి దాడులకు బయపడేది లేదని సీఎం చరణ్ జిత్ సింగ్ ప్రకటించగా, బీజేపీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ భగ్గుమంటోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే అసెంబ్లీ ఎన్నికల వేళ … పంజాబ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు కలకలం రేపుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా… మంగళవారం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పంజాబ్‌లో ఫిబ్రవరి 20 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ సోదాలు చర్చనీయాంశమయింది.

also read;-వలస వాదుల గుప్పెట్లో కాచన వల్లి

రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ మరదలి కుమారుడైన భూపిందర్‌ సింగ్‌ హనీ.. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే భూపిందర్‌ నివాసంతో పాటు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. చన్నీ బంధువు భూపిందర్‌ సింగ్‌ హనీ నివాసంతోపాటు మరో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ట్విటర్‌ వేదికగా బిజెపి పై విమర్శలు గుప్పించారు. ఈసీ ఎన్నికల తేదీలు బిజెపి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు. పంజాబ్‌లో బిజెపి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిందని అంటూ ట్వీట్‌ చేశారు. బిజెపి కుట్రపూరితంగానే దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

also read;-పంజాబ్‌ ఆప్‌ సిఎం అభ్యర్థిగా మాన్‌

పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో అక్రమ ఇసుక తవ్వకాలు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాంగ్రెస్‌ మాజీ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. ఇసుక మైనింగ్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం కెప్టెన్‌ మాట్లాడుతూ.. ‘ఇసుక అక్రమ రవాణాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ భాగస్వాములే. నేను పేర్లు చెప్పడం మొదలుపెడితే.. టాప్‌ (సిఎంను ఉద్దేశిస్తూ) నుంచి చెప్పుకుంటూ రావాలి‘ అని ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ విషయంలో చన్నీపై చాలాసార్లు విమర్శలను గుప్పించింది. సిఎం చన్నీ సొంత నియోజకవర్గమైన చామ్‌కౌర్‌ సాహిబ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని గతేడాది డిసెంబరులో ఆప్‌ ఆరోపించింది.