సానియా విూర్జా షాకింగ్ న్యూస్
టెన్నిస్కు గుడ్బై చెప్పిన స్టార్ షట్లర్
ఆస్టేల్రియన్ ఓపెన్లో ఓటమి తరవాత ప్రకటన
(మెల్బోర్న్-విజయంన్యూస్)
భారత అగశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా విూర్జా అభిమానులకు షాకింగ్ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్(2022) చివర్లో ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్టేల్రియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్తో కలిసి ఆస్టేల్రియన్ ఓపెన్ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్ ప్లేయర్..తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టింది.స్లోవేనియా జోడీ చేతిలో సానియా జోడీ 4`6, 6`7(5)తేడాతో ఓటమిపాలైంది. గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సానియా జోడీ గట్టిగానే పోటీనిచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. సానియా మిక్స్డ్ డబుల్స్లో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్తో కలిసి బరిలోకి దిగనుంది. కాగా, ప్రస్తుతం డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మాత్రమే ఆడుతున్న సానియా.. 2013లో సింగిల్స్ పోటీ నుంచి తప్పుకుంది. సానియా సింగిల్స్ కెరీర్లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్కు చేరుకుంది.
also read :-గజ్వెల్ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు
తన వయసు పెరుగుతోందని, ప్రస్తుతం తనకు శరీరం పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్నారు. తనకు మూడేళ్ల కుమారుడున్నాడని టూర్ల పేరుతో బాబు జీవితాన్ని రిస్క్లో పెట్టలేనని చెప్పారు. 2003 నుంచి టెన్నిస్ ఆడుతోన్న సానియా ఇప్పటివరకూ ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచారు. సింగిల్స్లో సానియా బెస్ట్ ర్యాంక్ 27 కాగా డబుల్స్లో 2007లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు. హైదరాబాద్కు చెందిన సానియా మిర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను 2010లో పెళ్లి చేసుకున్నారు. ఆస్టేల్రియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన సానియా విూర్జా ఇదే తన చివరి సీజన్ అని చెప్పింది. తన ఆటతీరుతో ఎన్నో టైటిళ్లను సాధించడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. కెరీర్లో మహిళల డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచింది. 2001 లో సానియా విూర్జా తన కెరీర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో పెళ్లి చేసుకుంది. 2018లో ఓ మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే దేశానికి, క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2006లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషన్ అవార్డును అందించింది. సానియా విూర్జా చాలా కాలంగా సింగిల్స్ ఆడటం మానేసింది. డబుల్స్లో కూడా తన ర్యాంకు మెరుగు పడకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణం అయి ఉండొచ్చు.
also read :-ప్రజలందరు స్వీయ రక్షణ పాటించాలి
ఆమె సింగిల్స్ కెరీర్లో స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి, ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించిన మార్టినా హింగిస్, డినారా సఫినా వంటి క్రీడాకారిణులపై మంచి విజయాలు నమోదు చేసుకున్నారు. 2007లో సింగిల్స్లో ప్రపంచ వ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచారు. భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా విూర్జా గుర్తింపు పొందారు. మణికట్టుకు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల సింగిల్స్కు దూరమయ్యరు. కానీ డబుల్స్ లో పప్రంచ నెం.1 ర్యాంకు సాధించారు. తన కెరీర్లో అత్యధిక పారితోషకం తీసుకన్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది సానియా విూర్జా. మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లోను ఆరు టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్2014లో అర్హత సాధించడంతో పాటు టైటిల్ను కూడా సానియా గెలుపొందారు. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్కు చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడవ
మహిళ సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో`ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించుకున్నారు. అందులో 6 బంగారు పతకాలు ఉన్నాయి. అక్టోబరు 2005లో టైం పత్రిక సానియాను 50 హీరోస్ ఆఫ్ ఆసియా‘గా పేర్కొంది