రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు పొడిగింపు
రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల అమలును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈనెలాఖరు వరకు ఆంక్షలు విధించింది. కొవిడ్ కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సర్కారు సూచించింది.
also read :-కూసుమంచి మండలాన్ని వణికిస్తున్న కరోనా
మరోసారి ఫీవర్ సర్వే
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు.. కలెక్టర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో… అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
also read ;-ఎమ్మెల్యే శంకర్ నాయక్ కె కరోనా పాజిటివ్
కలిసికట్టుగా కట్టడి
చేద్దాంరాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై సమావేశంలో చర్చించినట్లు హరీశ్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై… కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. గతంలో ఫీవర్ సర్వేతో దేశంలోనే ఆదర్శంగా నిలిచామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. పకడ్బందీగా జ్వర సర్వే చేపట్టి కొవిడ్ను కట్టడి చేద్దామని హరీశ్… కలెక్టర్లకు సూచించారు. వ్యాక్సినేషన్లోనూ వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు.