గవర్నర్కు మరోసారి ఘోర అవమానం..
—అడుగడుగునా షాకిస్తున్న అధికార పార్టీ
(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – విజయం న్యూస్);-
గవర్నర్ తమిళిసైని రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమాన పరుస్తోంది. తనకు తెలంగాణ సర్కార్ ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఇటీవల ఢిల్లీ పెద్దలు, జాతీయ మీడియా ఎదుట స్వయంగా తమిళిసై ఆవేదన వెళ్లగక్కిన విషయం తెలిసిందే. అయినా.. సీఎం కేసీఆర్ సర్కార్ తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
also read :-ఢిల్లీలో తెలంగాణ భవన్ నందు రైతు దీక్ష ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ నామ
భద్రాచలంలో నేడు జరిగిన పట్టాభిషేక మహోత్సవంతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గవర్నర్. రెండ్రోజుల పర్యటన ఖరారైంది. సోమ, మంగళ వారాల్లో ఆమె పలు సామాజిక కార్యక్రమాలతో పాటు పూసుకుంట ఆదివాసీ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులను గవర్నర్కు ప్రొటోకాల్ ఇవ్వకుండా వారిని సెలవుపై పంపించినట్లు సమాచారం.పట్టాభిషేకంలో కనిపించని ఉన్నతాధికారులు.. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన తమిళిసై పర్యటన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులెవరూ హాజరవకుండా ఆమెను అవమాన పరిచారు.
also read;-మహాత్మా జ్యోతిరావు పూలే కు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు .
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ సునీల్ దత్ గవర్నర్ పర్యటనకు రాకుండా డమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. వీరు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 48 గంటల సెలవుపై వెళ్లినట్లు సమాచారం. అంతేకాదు.. భద్రాద్రి రామాలయలంలోని పలు శాఖల హెచ్ఓడీలు కూడా గవర్నర్ పర్యటనకు హాజరు కాకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇటీవల యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లిన తమిళి సైకి ఆలయ పీవో గీతారెడ్డి హాజరు కాకుండా అవమాన పరిచిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే..