నేను ఉన్నంత కాలం మీరు ఏవరికి భయపడాల్సిన పని లేదు – భట్టి ???
( ఖమ్మం విజయం న్యూస్):-
ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఈ పాదయాత్ర వెంట్రుక తో సమానం అన్న వెధవలు దీని ప్రతి ఫలం అనుభవించక తప్పదు
ప్రజలు ,ప్రజా సమస్యలు మీకు వెంట్రుకతో సమానమా? 8ఏండ్లల్లో ఏంత మందికి కొత్త ఫించన్లు , డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నాఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు.
వరుసగా 10 రోజులుగా డీజిల్, పెట్రోల్
ధరలు పెంచి సామాన్య పేద ప్రజల పై తీవ్రమైన భారం మోపిన మోడీ సర్కార్కాంగ్రెస్ ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను అచ్చే దిన్ తీసుకొస్తానని ఇప్పుడు 1050 రూపాయలకు పెంచి ప్రజలకు సచ్చే దిన్ తీసుకొచ్చాడుమోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే… టిఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందిధరలు పెంచి ప్రజల నడ్డి విరగొట్టడంలో మోడీ, కేసీఆర్ పోటీ పడుతున్నారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రాజకీయాల కోసం కాదు..
రాహుల్ గాంధీ గారు తెలంగాణ లో పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలి అని అన్నారు ..
వరి ధాన్యం కొత్తగా పడించట్లే….చాలా కాలంగా వేస్తున్నాం ..
వరి వస్తే ఉరే అన్న ఈ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనిపించాలనే ఈ పాదయాత్ర…
మధిర గడ్డ , కాంగ్రెస్ అడ్డ రాసి పెట్టుకో ..