Telugu News

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే గ్రీవెన్స్ డే

సమస్యల పరిష్కారంలో అధికారులు సత్వర చొరవ చూపాలి

0

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే గ్రీవెన్స్ డే

== సమస్యల పరిష్కారంలో అధికారులు సత్వర చొరవ చూపాలి

== మధిరలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో అధికారులకు ఆదేశించిన కలెక్టర్

(మధిర/ఖమ్మం-విజయం న్యూస్);-
మండల పరిధిలో పరిష్కారమయ్యో సమస్యలను మండల పరిధిలోనే పరిష్కారించాలని, ఆయా మండల పరిధికి సంబంధించిన జిల్లా అధికారులకు సమస్యను తెలియజేసి సత్వర పరిష్కార స్వభావం చూపాలని
జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం మధిర మండల కేంద్రం వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన “గ్రీవెన్స్ డే”లో అర్జీదారులను నుండి పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి సమస్యల పరిష్కార చర్యకై సంబంధిత అధికారులను ఆదేశించినారు.

also read :-కెసిఆర్ పై నిప్పులు వర్షం కురిపించిన షర్మిల.

ఋణ, పించన్లు, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన దరఖాస్తులను అర్జీదారులు జిల్లా కలెక్టర్‌కు అందిజేశారు. మధిర మండలం రాయపట్నం గ్రామంకు చెందిన దేవరకొండ కవిత తాను వికలాంగురాలునని చెప్పుల షాపు నిర్వహించుకొనుటకు లోన్ దరఖాస్తు చేసుకోవడం జరిగినదని శాంక్షన్ ఆర్డర్ ఇచ్చినారని కాని ఇప్పటివరకు లోన్ ఇవ్వలేదని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి సత్వర చర్యకై ఇ.డి ఎస్సీ కార్పోరేషన్ అధికారికి కలెక్టర్ సూచించారు. మధిర పట్టణం శివాలయం వీధికి చెందిన శ్రీనిధి తనకు డబుల్ బెడ్ రూమ్ గృహం ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా రెవెన్యూ అధికారికి కలెక్టర్ సూచించారు. తల్లాడ మండలంకుర్నవల్లి గ్రామంకు చెందిన ఎస్.కె.మదార్ సాబ్, చావా రవి, వెంకటాచారీ, కోటిరెడ్డిలు తమ గ్రామంలో త్రాగునీటి కొరతను పరిష్కరించగలరని సమర్పించిన దరఖాస్తును మిషన్ భగీరథ అధికారులకు సమస్య పరిష్కారంకై సత్వర చర్యలు గైకొనాలని కలెక్టర్ ఆదేశించారు.

also read ;-బట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ ని కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

మధిర మండలం మడుపల్లి గ్రామంకు చెందిన అంబేద్కర్ లెథర్ ప్రోడక్ట్ సొసైటీ సభ్యులు లెథర్ పార్క్ నిర్మాణముకై నిధులు మంజూరు చేయగలరని, దళిత చర్మకారుల కుటుంబములకు ఉపాధి కల్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఎస్సీ కార్పోరేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. మధిర పట్టణం ఎస్సీ కాలనీకు చెందిన జి. శారమ్మ తాను టైలరింగ్ యూనిట్ స్థాపనకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా లోన్ సాంక్షన్ అయినదని, సబ్బిడీకి సంబంధించిన పైకం కూడా బ్యాంకు వారికి అందడం జరిగిందని ఇంతకు బ్యాంకు అధికారులు లోనకు సంబంధించిన జాప్యం చేస్తున్నారని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి సత్వర చర్యకై జిల్లా కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు సూచించినారు.

also read :-కోదాడ క్రాస్ రోడ్డులో ప్రమాదం

మధరకు చెందిన మార్త రాములు తనకు సర్వేనెం. 362/6లో 0.16.00 కుంటల భూమి ధరణి పాస్ బుక్ నుందు నమోదు కాలేదని పాస్ బుక్ అట్టి భూమని నమోదు చేయగలరని సమర్పించిన అర్జీని, రేగళ్ళ శివలీలా సద్దినేనిగూడెం రెవెన్యూపరిధిలో పట్టా నెం. 114/4/1212లో 30 కుంటల భూమి పాస్ పుస్తకములో నమోదు చేయించగలరని సమర్పించిన దరఖాస్తును, మధిర పట్టణంకు చెందిన వంకాయలపాటి నాగ ప్రతిభ తనకు ఖాతా నెం. 393 సర్వేనెం. 265/1లో 0.30 కుటల విస్తీర్ణం కలదని అట్టి భూమికి ధరణి పోర్టల్ పాసు పుస్తకం ఇప్పించగలరని సమర్పించిన అర్జీని పరిశీలించి తగు చర్యకై సంబంధిత తహశీల్దారును ఆదేశించినారు. గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.అప్పారావు, ఖమ్మం ఆర్.డి.ఓ రవీంధ్రనాద్, ఆవివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.