చింతకాని దళితులకు శుభవార్త
== దళితబంధు లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ
== ఒక్కోక్క లబ్ధిదారుడి ఖాతాలోకి రూ.1.50లక్షలు
== యూనిట్ల గ్రౌండింగ్ ను ప్రారంభించాలని అధికారులకు కలెక్టర ఆదేశం
(చింతకాని/ఖమ్మం-విజయంన్యూస్);-
చింతకాని మండల ప్రజలకు కలెక్టర్ ఉగాది పర్వదినం అనంతరం శుభవార్త చెప్పారు.. దళితబంధు పథకం అర్హులైన లబ్ధిదారులందరికి రూ.1.50లక్షలను బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రతి ఒక్క లబ్ధిదారుడు యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని, త్వరగా ప్రారంభించాలని, అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతకాని మండలం దళితబంధు లబ్దిదారులు యూనిట్ల గ్రౌండింగ్ ను ప్రారంభించాలని, మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసి మొదటి విడతగా 1 లక్షా 50 వేల రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.
also read :-నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్
లబ్దిదారులు ఎంచుకున్న రంగాలలో యూనిట్లు గ్రౌండింగ్ కు గాను అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు మొదటి విడతలో లక్షా యాభై వేల రూపాయలను లబ్దిదారుల ఖాతాలకు జమచేయడం జరిగిందని, డైరీ యూనిట్ స్థాపించుకునే వారు ముందుగా షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా పశు గ్రాసం పెంచుకునేందుకు భూమిలేని వారు కౌలు భూమి ఒప్పందం చేసుకోవడానికి, సెంట్రింగ్ యూనిట్లు గ్రౌండింగ్ చేసుకునే వారు మెటీరియల్ కొరకు అడ్వాన్సు చెల్లించి, అద్దె షాపులు లీజు ఒప్పందాలు చేసుకొని అవసరమైన కొటేషన్లు పొంది వివిధ యూనిట్ల గ్రౌండింగ్ కు ముందస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు గాను లబ్ధిదారుల ఖాతాలకు మొదటి విడతగా లక్షా 50 వేల రూపాయలు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ట్రాన్స్పర్టు రంగానికి సంబంధించి ఎక్కువ మంది లబ్ధిదారులు డిమాండ్ కంటే అధికంగా ఆసక్తి కనబర్చారని, ట్రాక్టర్లు, కార్లు, అటోలు వంటి వాహనాలకై ఎక్కువ మంది ఎంపిక చేసుకున్నారని, లైసెన్స్ లేనివారు, ట్రాన్స్ పోర్టు రంగంలో అనుభవం లేని లబ్దిదారులు కూడా ట్రాన్స్ పోర్టు రంగాలలో యూనిట్ల గ్రౌండింగ్ కు ఎంపిక చేసుకున్నారని, వారికి ఆలోచన
also read :-ఇఫ్తార్ లో పాల్గొన్న మంత్రిపువ్వాడ..
చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నామని, ట్రాన్స్ పోర్టు యూనిట్ల లబ్దిదారులకు ప్రస్తుతం లక్షా 50 వేల రూపాయలు జమచేయబడవని, వారి ఆలోచన మేరకు తిరిగి నిర్ణయం తీసుకున్న పిదప లక్షా యాభై వేల రూపాయలు ఖాతాలకు జమఅవుతాయని కలెక్టర్ తెలిపారు. చింతకాని మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళితబంధు మంజూరు చేయడం జరిగిందని, ఇట్టి విషయంలో ఎటువంటి అపోహాలు, అనుమానాలు అవసరం లేదని, మొదటి విడతగా యూనిట్ల గ్రౌండింగ్ కు అవసరమైన ముందస్తు ఏర్పాట్లకు గాను లబ్దిదారులుందరికి లక్షా 50 వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన మొత్తాన్ని గ్రౌండింగ్ పనులను బట్టి వారం రోజులలోపు లబ్దిదారుల ఖాతాకు జమచేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.