తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు
(ఖమ్మం -విజయం న్యూస్);-
సందర్భంగా ఖమ్మం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (గుట్ట) నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరుపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు(19.04.2022)తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయం కు కిలో బంగారాన్ని కానుకగా అందజేశయనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో వేద అర్చకుల నడుమ సంప్రోక్షణ నిర్వహించారు.
also read :-బస్తర్ ఫైటర్స్ రిక్రూట్మెంట్పై మావోయిస్టుల ఆగ్రహం
యాదాద్రి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.అనంతరం మంత్రి పువ్వడకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.