పువ్వాడఅజయ కుమార్ దిష్టిబొమ్మదగ్ధం
(ఖమ్మం-విజయంన్యూస్);-
పువ్వాడ అజయ్ కుమార్ నిరంకుశ వైఖరి, రాక్షస పాలన చేస్తూ బీజేపీ కార్యకర్తల పై అక్రమ కేసులు రౌడీషీట్లు పేట్టిస్తూ జాతీయ వాది అయిన సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం టూటౌన్ పరిధిలోని జెండాల సెంటర్ లో” రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధంచేశారు.
also read :-పల్లా యువసేన ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మ దహనం .
2వ టౌన్ అధ్యక్షుడు తాజ్ నోత్ భద్రం, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2వ టౌన్ జనరల్ సెక్రెటరీ మహీందర్ సింగ్, జిల్లా సీనియర్ నాయకులు, భూపాల్ పల్లి జిల్లా ఇంచార్జ్ సన్నే ఉదయ్ ప్రతాప్, సీతారాం, దాసరి మధు,వేల్పుల సుధాకర్ ,2టౌన్ ఉపాధ్యక్షులు కన్నెకంటి కృష్ణ చారి, నక్క రవి గౌడ్, యువమోర్చా అరుణ్,కళ్యాణ్, మోత్కూరు శ్రీనివాస్,రాజా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు