Telugu News

తెలంగాణ వడ్లు కోనాల్సిందే..

- రైతు దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

తెలంగాణ వడ్లు కోనాల్సిందే..

– రైతు దీక్షలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 

 (ఖమ్మం విజయం న్యూస్):-

రాష్ట్రంలో యసంగిలో రైతులు పండించిన వడ్లను కొనల్సిందే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు.

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం మంచుకొండ ప్రధాన రహదారిపై మండల పార్టీ అద్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మంత్రి పువ్వాడ పాల్గోని మాట్లాడారు.

also read;-పెట్రోల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీలపై కాంగ్రెస్‌ ఆందోళన

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు కొనాలని రైతులపై కక్ష ఎందుకని ప్రశ్నించారు… మా వడ్లు.. వడ్లు కావా ఆని ప్రశ్నించారు. తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు..

బిజెపి ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒకమాట మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వక్రబుద్దిని రైతులపై చూపించడం సిగ్గుచేట్నారు.ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలి అది కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు.దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉన్న విషయం తెలియకపోవడం విచారకరమన్నారు.

ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తుంది.. కానీ ఈ రెండేళ్ళ నుండి తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారని విమర్శించారు.తెలంగాణలో యాసంగిలో వడ్లు పట్టిస్తే నూకలు ఎక్కువ వస్తాయి అది సహజం.. దిగుబడి తగ్గుతది అందుకే ఇక్కడ బాయిల్ చేస్తాం ఆది కేంద్రంకు తెలుసునని.. గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇపుడు ఎందుకు వద్దు అంటున్నారు..??. అని ప్రశ్నించారు. ఇది కక్ష్యా సాధింపు చర్య కాదా ఆని ప్రశ్నించారు.

also read;-కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధం కావాలి

ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందం పీయూష్ గోయెల్ ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారు.. ఇది చాలా బాధాకరం.. తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు చేయండి అనటం సిగ్గుచేటన్నారు.రైతులను కించపరిచే విధంగా చాలా హీనంగా, ఘోరంగా అవమానిస్తున్నారు… రైతులు ఎక్కడైనా రైతులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.వరి వేస్తే ప్రతి గింజ కొనే బాధ్యత బిజేపిది అని బండి సంజయ్ ప్రకటించారు.. రైతులకు హామీ ఇచ్చారు.ప్రతి గింజా కొంటామన్నరు.

బండి సంజయ్, కిషన్ రెడ్డి లు యసంగిలో పండించిన వడ్లను కొనల్సిందే అని, తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు.. వడ్లు కావా ఆని ప్రశ్నించారు. తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు..బిజెపి ఢిల్లీలో ఒకమాట గల్లీలో ఒకమాట మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వక్రబుద్దిని రైతులపై చూపించడం సిగ్గుచేట్నారు.

ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలి అది కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు.దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉన్న విషయం తెలియకపోవడం విచారకరమన్నారు.ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తుంది.. కానీ ఈ రెండేళ్ళ నుండి తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారని విమర్శించారు.

also read;-ఆహ్లాదంగా ఖమ్మం హైటెక్ బస్ స్టాండ్

తెలంగాణలో యాసంగిలో వడ్లు పట్టిస్తే నూకలు ఎక్కువ వస్తాయి అది సహజం.. దిగుబడి తగ్గుతది అందుకే ఇక్కడ బాయిల్ చేస్తాం ఆది కేంద్రంకు తెలుసునని.. గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇపుడు ఎందుకు వద్దు అంటున్నారు..??. అని ప్రశ్నించారు. ఇది కక్ష్యా సాధింపు చర్య కాదా ఆని ప్రశ్నించారు.

ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందం పీయూష్ గోయెల్ ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారని, ఇది చాలా బాధాకరం అన్నారు.. తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు చేయండి అనటం సిగ్గుచేటన్నారు.నలుగురు మంత్రులు, 8మంది ఎంపిలు ఇతర ప్రతినిధులు ఢిల్లీ కి వెళ్తే కేంద్ర మంత్రి మమ్మల్ని కలవడానికి ఇబ్బంది పడ్డారని, రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి కించ పరిచేలా వ్యవహరించటం బాధాకరమన్నారు .రైతులను కించపరిచే విధంగా చాలా హీనంగా, ఘోరంగా అవమానిస్తున్నారు… రైతులు ఎక్కడైనా రైతులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

also read;-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే

వరి వేస్తే ప్రతి గింజ కొనే బాధ్యత బిజేపిది అని బండి సంజయ్ ప్రకటించారు.. రైతులకు హామీ ఇచ్చారు. ప్రతి గింజా కొంటామన్నరు ఇప్పుడేమైంది.. మీ మొహం ఎక్కడ పెట్టుకున్నారని ప్రశ్నించారు.కిషన్ రెడ్డి సైతం పలు మార్లు వరి వేయమని, కొంటామని పదే పదె ప్రకటించారు..అది బాయిల్ అయిన రా-రైస్ అయిన కొంటామన్నారు.. ఇపుడు మాటమార్చడం సిగ్గుచేటన్నారు.మీరు వడ్లు కొనం అనటమే సమస్య ఆని, అందుకే తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితిని కేంద్రం తీసుకువచ్చిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పంటలు విస్తారంగా పండిస్తున్నారంటే కారణం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి ప్రధన కారణమని వివారించారు.కేంద ప్రభుత్వం అందించే ఎరువులపై 20శాతం సబ్సిడీ ని తగ్గించారని తద్వారా ఎరువుల ధర పెరిగిందన్నారు.ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ వడ్లు కొనాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూస్తారని హెచ్చరించారు.