పువ్వాడకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య
(ఖమ్మం విజయం న్యూస్ ):-
ఈ రోజు శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి శవయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ.. ఖమ్మం నగర మేయర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతోందని అన్నారు. పువ్వాడ అజయ్కుమార్ రెండు మూడు పార్టీలు మారి దిక్కుతోచని స్థితిలో ఉంటే రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయం. . గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
also read;-పార్లమెంట్ వారిగా ఇన్ చార్జీలను నియమించిన కాంగ్రెస్
కేంద్ర మంత్రిగా చేసిన మహిళను సాటి మహిళవై విమర్శించడం సిగ్గుచేటని దూషించారు. పువ్వాడ అజయ్ వేధింపులకు విపక్ష నేత మరణిస్తే అది చిన్న విషయం అంటూ అనడం టీఆర్ఎస్ రౌడీ పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వంలో మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నారో మేయర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజైనా ప్రెస్ మీట్ పెట్టని మేయర్ నగరంలో పువ్వాడ అజయ్ చేస్తున్న అరచకాలకు వత్తాసు పలుకుతూ ప్రెస్ మీట్లు పెట్టడం హాస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వీధి లైట్లు నగరంలో ఫౌంటేన్లు ఏర్పాటు చేస్తే నగరం అభివృద్ధి చెందినట్టు కాదని టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత మందికి ఎన్ని రేషన్ కార్డులు మంజూరు చేశారో మేయర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడెండ్ల నుంచి కొత్త *ఫించన్లు ఇచ్చిన దాఖలు లేవని ఆరోపించారు. ఇకపోతే నగరంలో పువ్వాడ అజయ్ అరచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని అన్నారు.
also read;-కేకే ఇన్ర్ఫాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ తో పంపిణి
అధికార పార్టీ వారు ధర్నాలు చేస్తే పోలీసులు రక్షణగా ఉంటారని ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజలకే కానీ అధికార పార్టీకి మంత్రికి కాదని అన్నారు. పువ్వాడ అజయ్క భయం పట్టుకుందని అందుకే కులం పేరుతో మళ్ళీ కొత్త తరహా రాజకీయానికి తెరదీస్తున్నాడని వ్యాఖ్యానించారు. మే6వ తేదిన వరంగ్ నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభతో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంటో చూపిస్తామని అన్నారు.
అనంతరం 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ.. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడంలో పువ్వాడ అజయ్ దిట్ట అని విమర్శించారు. నగర మేయర్ మంత్రి పువ్వాడ అజయ్ండ చూసుకుని మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని ఏదో ఒక రోజు పువ్వాడ అజయ్ నీకు సున్నం పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా రేణుకా చౌదరి ఖమ్మం నగరానికి చేసిన అభివృద్ధి మరిచి మాట్లాడటం సరికాదని అన్నారు.
also read;-ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి: ముగ్గురికి తీవ్ర గాయాలు
ఇప్పుడు కమ్మకులం ఒక్కటవ్వాలని చూస్తున్న అజయ్క ఆత్మహత్య చేసుకున్న విపక్ష నేత సాయి గణేష్ కమ్మ కులం అనే విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రతిపక్ష కార్పొరేటర్లపై తప్పుడు ఆరోపణలు మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని హెచ్చరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకూ మంత్రి శవ యాత్ర చేసి దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ పల్లెబోయిన భారతీ, 57వ డివిజన్ కార్పొరేటర్ రషీదా భేగం, జిల్లా మహిళా నాయకురాలు ఏలూరి రజిని, పుష్ప తదితరులు పాల్గొన్నారు.