Telugu News

క్రికెట్ రవీంద్రజడేజా భార్య రివాబా సంచలన ప్రకటన 

ఇంటి గుట్టు బయటపెట్టిన క్రికెటర్ రవీంద్ర జడేజా సతిమణి

0

క్రికెట్ రవీంద్రజడేజా భార్య రివాబా సంచలన ప్రకటన 

== ఇంటి గుట్టు బయటపెట్టిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

== ఓటు వేసిన అనంతరం కుటుంబ సమస్య చెప్పిన రివాబా

(జామ్‌నగర్-విజయంన్యూస్):

టీమీండియా క్రికెట్ రవీంద్రజడేజా భార్య రివాబా సంచలన ప్రకటన చేసింది.. తన కుటుంబంలో ఉన్న సమస్యలను చెప్పింది.. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె ఒక నిజాన్ని బయటపెట్టింది.. కుటంబ సమస్యలను, కుటుంబ సభ్యులు తనకు మద్దతు ప్రకటించే విషయంపై స్పందించింది.  ఒకే కుటుంబంలో విభిన్న సిద్ధాంతాలను పాటించేవారు ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదని జామ్‌నగర్‌ భాజపా అభ్యర్థి, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా  అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భర్త కుటుంబ సభ్యులు తన ప్రత్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై ఆమె స్పందించారు. వాళ్లంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. ‘‘ఒకే కుటుంబంలో విభిన్న సిద్ధాంతాలను పాటించేవారు ఉండొచ్చు. ఒక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. దానివల్ల నష్టమేం లేదు.’’ అని రివాబా వ్యాఖ్యానించారు. జామ్‌నగర్ ప్రజలపై తనకు నమ్మకం ఉందని, భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితులకు బెయిల్‌

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత హరిసింగ్‌ సోలంకి కుటుంబానికి చెందిన రివాబా జడేజా 2019లో భాజపాలో చేరారు. ఆమె భర్త రవీంద్ర జడేజా కుటుంబీకులంతా కాంగ్రెస్‌ మద్దతుదారులే. పెద్దలు వీరిద్దరికీ 2016లో వివాహం జరిపించారు. రివాబా భాజపాలో చేరినప్పటికీ ఆమె భర్త కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్‌కే మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల రవీంద్ర జడేజా తండ్రి అనిరుద్ధ్‌ సిన్హ్‌ జడేజా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా కోరారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు జడేజా సోదరి, నైనబా జడేజా కూడా కాంగ్రెస్‌ అభ్యర్థినే గెలిపించాలని కోరడం ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబంలో ఉంటూ రెండు విభిన్న పార్టీలకు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి: వెంకటాపురం రెవెన్యూ శాఖలో..రింగ్ మాస్టర్

ఇటీవల అనిరుద్ధ్ సిన్హ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘‘కుటుంబం వేరు, పార్టీ వేరు. ఈ రెండింటినీ సరిపోల్చకూడదు. చాలా ఏళ్లుగా నేను కాంగ్రెస్‌ మద్దతుదారుగా ఉన్నాను.ఇప్పుడు కూడా కాంగ్రెస్‌తోనే ఉంటాను’’ అని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నంత మాత్రాన తన సోదరుడిపై గానీ, అతడి భార్యపై గానీ ప్రేమ ఏమాత్రం తగ్గదని నైనబా జడేజా అన్నారు. తమ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని, ఎవరికి నచ్చిన పనిని వారు చేసుకునే హక్కు ఉందని ఆమె తెలిపారు. దీనిపైనా రివాబా జడేజా స్పందించారు. ఒకే కుటుంబం నుంచి రెండు వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం కొత్తేం కాదని, గతంలో చాలా కుటుంబాల్లోనూ జరిగాయని అన్నారు. భర్త రవీంద్ర జడేజా తనకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారని, జామ్‌నగర ప్రజల అభిమానమే తనను ముందుకు నడిపిస్తోందని ఆమె తెలిపారు.