కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం…
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ బిక్కమళ్ల సంతోష్బాబుకు(37) మహావీర్చక్ర పురస్కారం లభించింది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య,తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర.
also read :- ఫోన్ బిల్లుల మోత.. ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా