నేటి సటి సావిత్రి||
( విజయంన్యూస్) :-
◆ యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు తిరిగి సంపాదించుకుందన్నది అలనాటి సతీసావిత్రి.. అడవి బాట పట్టి మావోయిస్టుల చెర నుంచి తన భర్తను రక్షించుకుంది ఇంజనీర్ అజయ్ భార్య అర్పిత.
◆ పసిబిడ్డను ఎత్తుకొని అడవి లోకి వెళ్లిన ఆమె పోరాటం ఫలించింది. చత్తీస్ఘడ్లో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన PMGSY సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. బీజాపూర్లో ప్రజాకోర్టు నిర్వహించిన తరువాత ఇంజనీర్ను విడుదల చేశారు మావోయిస్టులు.
◆ తన భర్తను వెతుక్కుంటూ అడవి లోకి వెళ్లారు అజయ్ రోషన్ భార్య అర్పిత. వారం రోజుల పాటు అర్పిత చేసిన పోరాటానికి తగిన ఫలితం దక్కింది.
◆ అర్పిత చేసిన పోరాటం మావోయిస్టుల హృదయాలను కదిలించింది. అర్పిత పోరాటానికి స్పందించిన మావోయిస్టులు సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ను విడుదల చేశారు.
◆ వారం రోజుల పాటు మావోయిస్టుల చెరలోనే ఉన్నారు అజయ్ రోషన్. సామాజిక వేత్తలు, భార్య అర్పిత విజ్ఞప్తి ని మన్నించి అజయ్ రోషన్ ను విడుదల చేశారు మావోయిస్టులు.
◆ బీజాపూర్ జిల్లా మాన్ కేళి,ఘడ్ గోర్ణ రోడ్డు నిర్మాణ పనులను గత గురువారం పరిశీలించడానికి వెళ్ళినప్పుడు సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్తో పాటు అటెండర్ను.
also read :-జగిత్యాల జిల్లా//