Telugu News

పేదల కోసమే 58,59 జీవో: మంత్రి పువ్వాడ

అర్హులైన వారికి భూ పట్టాలు పంపిణి చేసిన మంత్రి 

0
పేదల కోసమే 58,59 జీవో: మంత్రి పువ్వాడ
==  అర్హులైన వారికి భూ పట్టాలు పంపిణి చేసిన మంత్రి 
ఖమ్మం సెప్టెంబరు,22(విజయంన్యూస్)
ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు వారి ఆధీనంలో ఉన్న ఇంటి స్థలాన్ని వారికే పూర్తి హక్కులు కల్పించి నిశ్చింతగా జీవంచేందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంధ్రశేఖర్‌రావు  ఆలోచన చేసి ప్రభుత్వ ఉత్వర్వునెం.58 పథకం క్రింద పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, అదేవిధంగా ఇంటి స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే ఆర్ధిక స్తోమత లేని వారికి కూడా ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక సహాయం అందించేందుకు గృహలక్ష్మి పథకానికి రూపకల్పన చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.  శుక్రవారం ఖమ్మం నగరం భక్తరామదాసు కళాక్షేత్రంలో 398 మంది లబ్ధిదారులకు జి.ఓ.58 పట్టాలు, గృహలక్ష్మి పథకం క్రింద 230 మంది లబ్ధిదారులకు మంజూరు ఉత్వర్వులు జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నం ఎప్పుడు స్వాధీనపర్చుకుంటారో అనే ఆందోళనలో ఉన్న అర్హులైన వారందరికి పట్టాలు ఇచ్చి సర్వహక్కు పత్రాలు ఇచ్చి వారికి భరోసా కల్పించడం జరిగిందన్నారు.  2014 నుండి 2020 వరకు ఉంటున్న వారి నివాస దృవ పత్రాల ఆధారంగా మీ సేవ ద్వారా దరఖాస్తు సమర్పించిన అర్హులందరికి క్షేత్రపరీశీలన చేసి పారదర్శకంగా మొదటి విడతగా 3 వేల 2 వందల 53 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడం జరిగిందన్నారు.  అదేవిధంగా  ప్రతి పేదవారికి స్వంత ఇల్లు ఉండాలనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో పట్టణంలో ఇప్పటికే 2 వేల మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు.  స్వంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వారికి ఆర్ధిక చేయూత నందించేందుకు గృహలక్ష్మి పథకం క్రింద మూడు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించేందుకు  నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున  జిల్లాలో 15 వేల 5 వందల మంది లబ్ధిదారులకు  మూడు విడతలుగా బేస్‌మెంట్‌, స్లాబ్‌ లెవల్‌, నిర్మాణం పూర్తి దశలలో ఒక లక్ష రూపాయల చొప్పున మూడు లక్షలు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ
పేద ప్రజలు స్వంత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఏదో ఒక నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్న వారు వేల సంఖ్యలో భయం భయంగా జీవించే వారని, అట్టి వారి స్థితిగతులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి హక్కు కల్పించాలనే సంకల్పంతో  రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉత్వర్వునెం.58 క్రింద  రెగ్యులరైజ్‌ చేయలని ఆదేశించడం జరిగిందని, మొదట్లో 2016 వరకు ఉన్న వారికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, రెండవ సారి ప్రభుత్వం ఏర్పాటు అయిన పిదప జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌  చొరవతో 2020 వరకు ఆదీనంలో ఉన్న వారికి సైతం పథకం క్రింద పట్టాలు అందించడం జరిగిందన్నారు.  రెండవ విడతలో 15 వేల దరఖాస్తులు రావడం జరిగిందని, ప్రతి లబ్ధిదారుని వద్దకు వెల్లి విచారణ చేసి లబ్ధిదారులచేత దరఖాస్తు చేయించి వారికి పట్టా వచ్చేలా జిల్లా అధికారులు,  మున్సిపల్‌ అధికారులు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, తహశీల్దార్లు కలెక్టరేట్‌ సిబ్బంది అందరూ విశేషకృషి చేయడం వల్ల పారదర్శకంగా ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు.   ఈ సందర్భంగా తొడ్పాటు నందించిన వారందరికి కలెక్టర్‌ అభినందనలు తెలిపారు.  రాష్ట్రంలోనే హైద్రాబాదు తరువాత రెండవ స్థానంలో ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పట్టాలు అందించడం జరిగిందన్నారు.  దీనితో పాటు ఇంటి స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక సహాయం అందించలనే సంకల్పంతో రూపకల్పన చేసిన పథకం గృహలక్ష్మి క్రింద 230 మంది లబ్ధిదారులకు రాష్ట్ర రవాణ శాఖ మంత్రివర్యులు మంజూరు  ఉత్తర్వులు అందించారన్నారు.

లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని మూడు విడతలుగా లబ్ధిదారుని ఖాతాకు నగదు జమ చేయడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్‌ పునుకొల్లునీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డి.సి.సి.బి చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌, డిప్యూటీ కమీషనర్‌ మల్లీశ్వరీ, ఆర్‌.డి.ఓ గణేష్‌, తహశీల్దారు స్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.