దేవుని పై జీవిత సత్యం చెప్పిన మంత్రి
జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే ఆధ్మాత్మికత ఒక్కటే మార్గం: మంత్రి పువ్వాడ.
== అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూత.. తద్వారా రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతుంది.
== దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ.. బట్టలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం..
== రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం, గుడ్ షెఫరడ్ చర్చ్, మజీద్ లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు.ఖమ్మం, జూన్ 21(విజయంన్యూస్):
ఇది కూడా చదవండి: తెలంగాణ కోసం జీవితాన్ని అంకితమిచ్చింది జయశంకర్: మంత్రి పువ్వాడ.
అనంతరం రోటరీ నగర్ లోని గుడ్ షెఫడ్ చర్చ్, తుమ్మలగడ్డలోని మజీద్- ఏ-అస్టాబల్ లో ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆది నుండి అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ, లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నదని, ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ఈ దేశానికి బలం అని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ దిశగా అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతు

== అధికారికంగా క్రిస్మస్ పండుగ..
రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రతీ ఏటా రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని, క్రిస్మస్ విందులు ఏర్పాటు చేస్తున్నదని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని చర్చిలలో ఒక్కో చర్చికి రూ. 2 లక్షల చొప్పున కేటాయించి క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఏడాది పేద క్రైస్తవులకు కొత్త బట్టలను పంపిణీ చేస్తు 2022 క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.85 లక్షల మందికి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన

కోకాపేట్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో క్రిస్టియన్ భవన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నదని, దీంతో పాటు చర్చీలు, గ్రేవ్ యార్డుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నదన్నారు. చర్చిల నిర్మాణాలకు అనుమతులు సులభతరం, పునరుద్ధరణకు చర్యలు
చర్చిల నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసి, తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చిల నిర్మాణానికి కఠిన నిబంధనలుండేవని కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వెసులుబాటు కల్పించిందన్నారు.
== అధికారికంగా రంజాన్ వేడుకలు.. తోఫాలు..
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రంజాన్ పండుగ నిర్వహణ
గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, సామాజిక స్వరూపాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, మొహర్రమ్, పీర్ల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయిందన్నారు. అనేక దర్గాలకు హిందువులు సైతం వెళ్తారని, దేశంలో మైనారిటీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు భరోసానిస్తూ వారి సాంప్రదాయాలను, విశ్వాసాలను గౌరవిస్తూ రంజాన్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. అదే విధంగా 2015 నుండి ప్రతీ ఏటా రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో దావత్-ఇ-ఇప్తార్ కార్యక్రమాన్ని, 2017 నుండి పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బట్టల పంపిణీ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నదన్నారు. షాదీ ముబారక్ పథకం
రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లిం మైనార్టీ ఆడ పిల్లల వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించే సదుద్దేశంతో 2014 అక్టోబర్ 2 నుండి షాదీ ముబారక్ అనే ప్రయోజనాత్మకమైన పథకాన్ని ప్రారంభించి, ఈ పథకం కింద షా


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా మైనార్టీ అధికారి మెహమూద్, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, బుర్రి వెంకట్ కుమార్, దండా జ్యోతి రెడ్డి, దాదే అమృతమ్మ సతీష్, మడురి ప్రసాద్, మక్బూల్, ఆలయ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు (చిన్నా), పాస్టర్ లు రెవ.జాన్ కాంతారావు, రెవ. బి. సత్యపాల్, జోజి, ఖమర్, షౌకత్ అలీ, మెహబూబ్ అలీ, ముఫ్తీ ఖలీక్, తాజ్ఉద్దీన్ ఎండీ గాయాజ్, షంశుద్దిన్, టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.