అనుకున్నదొక్కటి… అయినది మరొక్కటి.
జన్ @ ధన్ ఖాతాలోకి 15లక్షలు.. మోదీ ఇచ్చారనుకుని..
అది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్వాడీ గ్రామం.
అక్కడ నివసిస్తున్న ధ్యానేశ్వర్ జనార్ధన్ అనే రైతు జన్ధన్ ఖాతాలో 15లక్షలు జమయ్యాయి.
ఈ డబ్బంతా మోదీనే ఇచ్చారనుకుని , ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని కార్యాలయానికి మెయిల్ కూడా పంపాడు.
9లక్షలతో ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు.
also read :-హైదరాబాద్: మాదక ద్రవ్యాల సరఫరా,
మిగిలిన వాటిని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా.. ఆయనకు పిడుగులాంటి వార్త అందింది.
ఆ డబ్బు తమదని, పొరపాటున మీ ఖాతాలో జమైందని, తక్షణమే చెల్లించాలంటూ గ్రామ పంచాయతీ లేఖ పంపింది.
మిగిలిన 6లక్షలను తిరిగిచ్చేసినా.. ఇప్పటికే ఖర్చు చేసిన 9లక్షలను ఎలా ఇవ్వాలని ధ్యానేశ్వర్ తలపట్టుకుంటున్నాడు.