Telugu News

కేసీఆర్ నాయకత్వంలో అబ్బురపర్చే అభివృద్ధి: నామా

10 కి 10 సీట్లు గెలిచి, కేసీఆర్ కు బహుమతిగా ఇద్దాం

0

కేసీఆర్ నాయకత్వంలో అబ్బురపర్చే అభివృద్ధి: నామా

➡️  అభివృద్ధి లో దూసుకుపోతున్న పట్టణాలు, నగరాలు

➡️ రాబోయే  కాలంలో కేసీఆర్ కు అండగా ఉండాలి

➡️ 10 కి 10 సీట్లు గెలిచి, కేసీఆర్ కు బహుమతిగా ఇద్దాం

👉 మధిర పట్టణ ప్రగతి కార్యక్రమంలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

 మధిర, జూన్ 16(విజయంన్యూస్):

సీఎం కేసీఆర్ దార్శనికత, యువ నాయకుడు, మంత్రి కేటీఆర్ దిశ నిర్దేశకత్వం, నాయకత్వంలో తెలంగాణాలో 9 ఏళ్లలో ప్రపంచాన్ని అబ్బురపరిచే రీతిలో బ్రహ్మాoడమైన అభివృద్ధి జరిగిందని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.శుక్రవారం పండుగ వాతావర ణంలో  మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత అధ్యక్షతన మధిరలో  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడారు.

ఇది కూడా చదవండి: రోడ్డుపై చెత్త ఏంటి..? మంత్రి పువ్వాడ ఆగ్రహం..

కేసీఆర్ విప్లవాత్మకమైన సరికొత్త  ఆలోచనలు , సంస్కరణల ఫలితంగానే దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి జరుగిందని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పిరేషన్లు అనూహ్య ప్రగతిలో దూసుకుపోతు న్నాయని అన్నారు.వైకుంఠ దామాల నిర్మాణం ఒక చరిత్ర అన్నారు. తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారని అన్నారు.ప్రపంచమే అబ్బురపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ కు మరింత అండగా ఉండి,మంచి మెజార్టీతో గెలిపించుకొని , మరింత అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాలోని 10 సీట్లను గెల్చుకొని  కేసీఆర్ కు బహుమతిగా ఇద్దామని నామ అన్నారు.ఈ సందర్భంగా వేదికపై మున్సిపల్ కార్మికులను సన్మానించారు.  అంతకు ముందు నామ మీటింగ్ హాలు వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  బతుకమ్మలతో స్వాగతం పలికారు.మధిర మున్సిపల్ ఛైర్ పర్సన్ మొండితోక లత గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి , పార్టీ నాయకులు వెంకట రెడ్డి,  బొమ్మెర రామ్మూర్తి, మొండితోక జయాకర్ , రంగిశెట్టి కోటేశ్వరరావు, చావా రామకృష్ణ, కనుమూరి వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, చావా వేణు, దిశ వెంకటేశ్వర్లు, అప్పారావు, మల్లాది వాసు, మున్సిపల్ కౌన్సిలర్లు,  కమిషనర్ రమాదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి: మున్నేరులో ఎమ్మెల్యే ఈత సరదా