Telugu News

అసెంబ్లీలో భట్టి ప్రశ్నల వర్షం

ఏ శాఖను వదలని సీఎల్పీనేత

0

అసెంబ్లీలో భట్టి ప్రశ్నల వర్షం

== ఏ శాఖను వదలని సీఎల్పీనేత

== మంత్రులకు, భట్టికి మధ్య వార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ఏ శాఖను కూడా వదల్లేదు. అన్ని శాఖల్లో ప్రశ్నలను సందించారు. ప్రజా సమస్యలను   సభ ద్రుష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో మైక్ కట్ చేస్తున్న స్పీకర్ పై కూడా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో వంద మంది సభ్యులుండోచ్చు ప్రతిపక్షంలో ఒక్కరే ఉండొచ్చు. కానీ ప్రతిపక్షం గొంతు వినిపించడం ప్రజాస్వామ్యంలో ప్రధానఘట్టం.ప్రధాన లక్షణం. ఈ ప్రధానలక్షణం లేకుండ బంద్ చేస్తే అది ప్రజాస్వామ్యం కాదని అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టును విదేశీయులకు, డిస్కవరీ చానల్స్ కు అవకాశం ఇస్తారు. కానీ ఆప్రాజెక్టును చూడటానికి ప్రతిపక్షాలకు అశకాశం ఇవ్వరు అని అన్నారు. గోదావరి వరదలతో మునిగిపోయిన పంప్ హౌజ్ లను చూడటానికి కాళేశ్వరం వెళ్లితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆరెస్ట్ చేయించారు. ఇదేక్కడి న్యాయం? కనీసం స్థానిక శాసనసభ్యుడు శ్రీధర్ బాబుని కూడ అనుమతించకపోవడం దారుణమని అన్నారు.

allso read- ఇల్లందులో మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది..?

ప్రజల సంపదతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అవకతవకలు బయటపడుతాయన్న భయంతోనే ప్రభుత్వం మమ్మల్నీ అడ్డుకున్నట్టు అర్దమవుతుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టుల వెనుక ఉన్న భూములు ముంపునకు గురువుతున్నాయి. పంటలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యకకు శాశ్వత పరిష్కారం చేయాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టకముందు కాంగ్రెస్ హాయంలో చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా  చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణలో బిఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు దాటుతున్న ఆప్రాజెక్టును పూర్తి చేయకుండ గాలికివదిలేశారని, ఈ ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎప్పుడు సాగు నీటిని రైతులకు అందిస్తారో సమధానం చెప్పాలని ప్రశ్నించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించే విధంగా పోరాటం చేసి నిధులు తీసుకురావలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిపిఆర్ ను కేంద్రానికి సబ్ మిట్ చేస్తే పనులు ఎందుకు ఆగిపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని సూటిగా అడిగారు. జూరాల, కోయిలసాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను కాంగ్రెస్ కట్టిందేనని,  మేం నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే పాలమూరులో నీళ్లు ఫుల్, చేపలు ఫుల్, పంటలు ఫుల్ అయ్యాయి. మేం చేసిన అభివృద్ధిని మీరు కంటిన్యూ చేశారంతే దానినే గొప్పలుగా చెప్పుకుంటే ఎట్లా? అని ప్రశ్నించారు.

allso read- స్వంత గూటికా..?సోదరి గూటికా..?  పొంగులేటి దారేటు..?

దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 8లక్షల ఎకరాలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజీవ్ సాగర్, ఇందిరసాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతరామ ప్రాజెక్టుగా మార్చి 8ఏండ్లు అవుతున్న ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సీతమ్మ ఆనకట్ట కడితే దుమ్ముగూడేం, చర్ల, భద్రచలం మునగకుండ తీసుకునే చర్యలు ఏంటీ అని ప్రశ్నించారు. సీతమ్మ ప్రాజెక్టు నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్న ప్రభుత్వం ఎకరానికి రూ.8లక్షలు ఇస్తే ఎట్లా? ప్రస్తుతం ధర 30లక్షలు ఉంది, కనీసం 24లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎ.పి ప్రభుత్వం సంఘమేశ్వర వద్ద రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే తెలంగాణలోని కృష్ణా నది ప్రాజెక్టులు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం దీనిపై డృష్టి సారించాలని కోరారు.  కాంగ్రెస్ హాయంలో ప్రారంభించిన మధ్య తరహా నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందనే కోపంతో ఆ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండ పెండింగ్ లో పెట్టడం సరికాదని అన్నారు. మున్నేరుపై ముదిగొండ మండలం పండ్రేగుపల్లిలో నిర్మించిన ప్రాజెక్టు 70శాతం పూర్తి అయ్యింది. మిగత 30 శాతానికి నిధులు ఇవ్వకుండ బిఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ఐటీసీకి మెయింటేనెన్స్ కు నిధులు పెంచాలని, నల్లగొండ లో ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు నిదులు ఇచ్చి పనులు త్వరగా పూర్తి *చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో చర్ల శివన్నగూడెం రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇంక పనులు ప్రారంభించలేదని, ఎప్పటిలోగా పూర్తి చేసి సాగు నీరు ఇస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టుకు ఏదులా నుంచి ఇస్తారని, వటెం రిజర్వాయర్ నుంచి ఇస్తారన్న ప్రకటనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి నీళ్లు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ , సింగూర్ నుంచి సంగారెడ్డికి ఎప్పటిలోగా నీళ్లు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని, సాగునీటి ప్రాజెక్టుల కొరకు తీసుకువచ్చిన అప్పులు రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులకు కేటాయించారని అన్నారు.

allso read- భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపి:భట్టి

సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు? దానికి అయిన ఖర్చు? ఎంత కరెంట్ చార్జీలు ఎంత? అని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిలో పట్టపగలు దారుణంగా హత్యలు జరుగుతున్నాయి.  ఈ హత్యలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. వీటి నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలని కోరారు. 1996 పోలీస్ బ్యాచ్ లో కొందరి పదోన్నతులు ఇచ్చి కొందరికి ఆపారు. ఎందుకు ఆపారని, 2022 పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్తులు నష్టపోతున్నారని ఆందోళన చేసిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ను అక్రమంగా ఆరెస్ట్ చేసి నక్సలైట్ మాదిరిగా చూశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపితే గౌరవించండి. కానీ సంఘ విద్రోహ శక్తలును చూసినట్టు చూడోద్దని అసెంబ్లీకి సూచించారు.

 

2022లో పోలీస్ రిక్రూట్ మెంట్స్ ఈవేంట్స్  లో 2 క్వాలీఫై అయిన వారికి కూడ మెయిన్స్ రాసే అవకాశం ఇవ్వండి. ఈవేంట్స్ ను డబుల్ చేసి డిస్ క్వాలీఫై చేస్తే ఎట్లా? అని ప్రశ్నించారు. పోలీసులతో సమానంగా చాలా ఏండ్ల నుంచి పని చేస్తున్న హోం గార్డులను ప్రభుత్వం పర్మినెంట్ చేసి పే స్కేల్ అమలు చేయాలని కోరుతున్నానుని అన్నారు. గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 ప్రకారం చాలా మందికి మేలు జరుగుతుందని, గాంధీ ఆసుపత్రిలో ఈ రోజు గడువు దాటిన మందులు పంపిణీ చేయడంతో రోగులు ఆందోలన చెందుతున్నారని ఆరోపించారు. ఆరోగ్య మంత్రి  నెలకు ఒక్కసారైన ప్రభుత్వ ఆసుపత్రులను రెగ్యూలర్ గా విజిట్ చేస్తే వైద్య సిబ్బంది నిబద్ధతతో పని చేసే అవకాశం ఉంటుంది.

ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్తకు చేరుకుంది. రోగులకు చికిత్స ఇబ్బందిగా మారింది. కొత్త బిల్డింగ్ కట్టండి.

allso read- పొంగులేటి కాంగ్రెస్ కు రండీ..:భట్టి

చాలా ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది కొరత ఉన్నది వెంటనే భర్తీ చేయాలని అన్నారు. మనం తినే ఆహార పదర్థాలు అంత కల్తీమయం అవుతున్నాయి. నూనే, కారం, పసుపు, పాలు కల్తీ కావడం వల్ల క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు. కాబట్టి క్యాన్సర్ రోగులకు మెరుగైన సేవలు అందించడానికి రాష్ట్రంలో ఒక కొత్త క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించండి.మన ఊరు-మన ప్రణాళిక, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వకుండ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వల్ల సర్పంచ్ లు  తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఎక్కి సర్పంచ్లు దర్నాలు చేస్తున్న బిల్లులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.  గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టర్ ఈఎంఐ చెల్లించకపోవడంతో మధిర మండలం సైదిల్లీపురం సర్పంచ్ పర్సనల్ ఖాతాను ఎస్ బిఐ  బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారని అన్నారు. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ వేతనాలు పెంచాలి. పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏటా ఈజిఎస్ పథకానికి నిధులకు కోత పెడుతున్నందున ఢిల్లీకి ఆఖిలపక్షం తీసుకువెళ్లితే మీరు. మేము కలిసి పోరాడుతాం కదా? ఎందుకు తీసుకువెళ్లడం లేదని అన్నారు. కాంగ్రెస్ ఎంపిలు పార్లమెంట్ లో ఈ నిధులు కోసం పోరాటం చేస్తున్నారని, మత్స్య కార్మికులకు వలలు, టూ వీలర్ బైక్ లను పెద్ద సంఖ్యలో  పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్స్ అందించి ఐడీ కార్డులు ఇవ్వాలని, గవర్నర్ వద్ద ఎన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కారణాలు ఎంటనీ ప్రశ్నించారు. ప్రయివేటు యూనివర్శిటీల బిల్లు ఆమోదం రాకుండానే ఆయ  విద్య సంస్థలు అడ్మిషన్లు తీసుకున్నారు. ఇందులో చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారనుంది. కాబట్టి గవర్నర్ గారి వద్ద ఉన్న బిల్లలకు ఆమోదం జరిగే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి.