బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక :మంత్రి పువ్వాడ
ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఆర్థిక మందగమనంపై కేంద్రం మౌనమెందుకు?
బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక
== ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ఆర్థిక మందగమనంపై కేంద్రం మౌనమెందుకు?
== మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభలో బీజేపీ పై మండిపడిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మంప్రతినిధి, అక్టోబర్ 13(విజయంన్యూస్)
తెలంగాణలో కులవృత్తుల జీవనోపాధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం రాత్రి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొరటికల్ గ్రామంలో కురుమ ఆత్మీయ సమ్మేళన సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.తెలంగాణలో ప్రతి వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పమని, అదే తమ సిద్ధాంతం అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ALLSO READ- కేశ్వాపురం సర్పంచ్ మృతి
నిన్నటివరకు కురుమలు ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, వారికి మొదటి సారి గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి తేల్చిచెప్పారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసిఆర్ సారథ్యంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతున్నదని విమర్శించారు. బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి వాటికి ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇతర బయటి అంశాలనే కారణమని మోదీ సర్కార్ చెప్పుకురావడాన్ని ఆక్షేపించారు. వీటికి బయటి అంశాలే కారణమని బీజేపీ ప్రభుత్వం చేతులెల్తేసిందని, అలాంటప్పుడు అధికారంలో మౌనంగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆయన పాలనను యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కురుమసంఘం నేతలు పాల్గొన్నారు.
ALLSO READ- మునుగోడులో మంత్రి పువ్వాడ ప్రచారజోరు