పాదయాత్రలో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కేతపల్లి పాదయాత్ర శిబిరంలో చికిత్స అందించిన వైద్యులు
అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
== కేతపల్లి పాదయాత్ర శిబిరంలో చికిత్స అందించిన వైద్యులు
== వడదెబ్బ కారణంగా జ్వరంతో బాధపడుతున్న భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం నుండిబయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పిపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేపట్టిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి హుటాహుటిన వైద్యులు వచ్చి నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వడదెబ్బ కారణంగా హైఫీవర్ రావడంతో మంగళవారం సాయంత్రం జరుగాల్సిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టి 96 రోజులు కావస్తున్నది.
ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీతో ‘పొంగులేటి’ చర్చలు సఫలం..?
గత మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో తీవ్రమైన వడగాలులు ఉన్నాయని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే. కాగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలన్న సంకల్పంతో భగ భగ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా పాదయాత్ర చేయడం వల్ల సిఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బకు గురయ్యారు. అయితే ఇటీవలే మహుబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బకు గురై అస్వస్తతకు గురైయ్యారు. అప్పుడు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న భట్టి విక్రమార్క మూడవ రోజు నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వినలేదు. కొద్ది రోజుల్లోనే ఎండ తీవ్రత మరింతగా ఉన్నప్పటికి 45 డిగ్రీలకుపైగా ఎండ ఉన్నప్పటికి భట్టి విక్రమార్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం మంగళవారం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో భట్టి విక్రమార్కకు సన్ స్ట్రోక్ తగిలి జ్వరం పెరిగిందని వైద్యులు తెలిపారు. ఐదురోజుల విశ్రాంతి కావాలని కోరారు.
== పలువురు ప్రముఖుల పరామర్శ
భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు చెరుకు సుధాకర్, వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న సీఎల్పీ నేత ను కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని కోరారు.
==హుటాహుటిన బయలుదేరిన జిల్లా కాంగ్రెస్ నేతలు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుండగా అస్వస్తతకు గురికావడంతో వైద్యులు వైద్యసేవలను అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హుటాహుటిన ఖమ్మం నుంచి బయలుదేరి నకిరేకల్ నియోజకవర్గంలోని కేతుపల్లికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావిద్, పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, వడ్డే నారాయణరావు, రాందాస్ నాయక్, బాలాజీ నాయక్, డాక్టర్ రవి, పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, దొబ్బల సౌజన్య, ఎడ్లపల్లి సంతోష్, జిల్లా నాయకులు భానోత్ బాలాజీ నాయక్, పొట్ల మాధవి, వైద్యసేవలను పొందుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని, తిరిగి పాదయాత్రను చేపట్టాలని దేవుళ్లను ప్రార్థించారు.