== బిజెపిని కట్టడి చేయడం కాంగ్రెస్ తో నే సాధ్యం
== వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి పయనించాలి
== పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నా
== ఖమ్మం మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

== ప్రజాసమస్యల ఊసే లేని బిఆర్ఎస్ సభ
ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలో గిరిజనలు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్య పరిష్కారం గురించి బిఆర్ఎస్ సభలో ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణలో ప్రతి జిల్లాకు యూనివర్శిటి ఉందని, కానీ ఖమ్మం ఉమ్మడి జిల్లాకు యూనివర్శీటి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. యూనివర్శిటి ప్రకటన చేయాలని కోరినప్పటికి సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం తగదన్నారు.
== కాంగ్రెస్ తోనే దేశాభివృద్ది
దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ హాయంలో ఏర్పాటు చేసిన సంస్థలు, వ్యవస్థలు, ప్రణాళికలు, ప్రజాస్వామ్య బలోపేతానికి వేసిన పుణాదులు, మిశ్రమ ఆర్ధిక విధానాలు తీసుకొచ్చి దేశం పురోగమనం సాధించేందుకు కాంగ్రెస్ చేసిన కృషి ఫలితమేనని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఆనేక సంస్థలకు అధిపతులై దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారంటే దేశంలో కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకొచ్చిన స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధి గొప్పతనమే అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి హరిత విప్లవం, పాడిని అభివృద్ధి చేసి శ్వేత విప్లవం, నీలి విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణల అమలు, గరిభీ హఠావో నినాదం, ప్రభుత్వ విద్య సంస్థల్లో చదువుకున్న పేదలకు, సామాన్యులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, ఇతర సర్వీసు రంగాల్లో భారత్ అగ్రగా

సాధించుకున్న లౌకిక వ్యవస్థను, సామ్యవాద విధానాలకు ఇబ్బంది పెడుతున్న బిజెపిని దూరం పెట్టడానికి రాహుల్ గాంధి చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30న శ్రీనగర్ ముగుస్తున్నందన పెద్ద సభ నిర్వహిస్తున్నారని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామిక వాదులు, లౌకిక వాదులు కాంగ్రెస్ చేసే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర మొదలవుతుందన్నారు.
బ్లాక్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు రెండు నెలల పాటు నిర్వహించే హాత్ సే హాత్ జోడో యాత్రలో ఇంటింటికి వెళ్లి రాహుల్ గాంధి సందేశాన్ని వినిపించి దేశాన్ని కాపాడుకుందామని విజ్ఞప్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ఆలోచనలు, భావా జాలాన్ని ప్రచారం చేసి హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు రెండు నెలల పాటు కష్టించి పని చేయడానికి కార్యకర్తలు సమయాత్తం కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,టిపిసిసి ఉపాద్యక్షులు ,మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పులిపాటి వెంకయ్య, ఖమ్మం నియోజకవర్గ పిసిసి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, వైరా నియోజకవర్గ పిసిసి సభ్యులు మాళోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సయ్యద్ హుస్సేన్, నగర బి సి అద్యక్షులు బాణాల లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.