కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం: డాక్టర్ రవి
== పేదలు,ప్రజలందరు కాంగ్రెస్ ను గెలిపించండి
== హత్ సే హత్ జోడో యాత్రలో ఇల్లెందు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రవి
(ఇల్లెందు-విజయంన్యూస్)
కొత్త సంవత్సరంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, ప్రజలందరు కాంగ్రెస్ ను ఆదరించేందుకు సిద్దంగా ఉన్నారని, కచ్చితంగా కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సంసిద్దులైయ్యారని ఇల్లెందు నియోజకవర్గ నాయకులు డాక్టర్ రవి తెలిపారు. ఇల్లెందు నియోజక వర్గం టేకులపల్లి మండలంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భూక్య దేవనాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాత్సేహాత్ జోడో యాత్రలో డాక్టర్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు టేకులపల్లి పట్టణo లో ప్రతి గడపగడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై వారికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపులో భాగంగా ఇల్లెందు లో హత్ సే హత్ జోడో యాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గెలవాలి: భట్టి
2023 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు ప్రకటించిన మేలును గురించిన (డిక్లరేషన్)సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ 2023 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతన్నలకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం, ధరణి పోర్టల్ రద్దుచేసి పోడు భూములకు పట్టాల పంపిణీ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, ఒక ఇంట్లో అర్హులైన దంపతులు ఇద్దరికీ రూ.5000 వృద్ధాప్య పెన్షన్, తెల్ల కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు అన్ని జబ్బులకు ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్యం, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం & ఇందిరమ్మ ఇల్లుల మంజూరు, ప్రతి పేద కుటుంబానికి 9 రకాల నిత్యావసర సరుకుల(రేషన్)పంపిణీ, నిరుద్యోగులకు నెలకురూ.4000లు నిరుద్యోగ భృతి, ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 25 వేల గౌరవ పెన్షన్, 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతీకి ఎలక్ట్రిక్ స్కూటర్ అందజేత, కేజీ టు పీజీ ఉచిత విద్య , తదితర సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని వారు ప్రజలకు వివరించారు.
ఇది కూడా చదవండి: షర్మిళ..విలీనామా..? విహారమా..?
తెలంగాణలో ప్రజా సంక్షేమo బాగుండి ,సమ సమాజ స్థాపన జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని,కావున ప్రజలందరూ రానున్న 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందిగా పారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భూక్య దేవా నాయక్, టేకులపల్లి మండల కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు ఆకారపు స్వప్న, సురేష్, నరేష్, ధర్మ, అర్జున్,ఇల్లoదు పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బానాల శ్రీనివాస్, పసిక తిరుమల్, సత్యనారాయణ, ఇల్లందు పట్టణ మాజీ కౌన్సిలర్ ధరావత్ కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సి సెల్ వైస్ చైర్మన్ బి ఎన్ గోపాల్, ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఆనంద్, ఇల్లందు నియోజకవర్గ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ అరవిందస్వామి, సూరజ్,ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాష,జమీర్, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.