రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం:సీతక్క
ఎన్నికల సమయం లో కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం 1లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి*
రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం:సీతక్క
== ఎన్నికల సమయం లో కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం 1లక్ష రూపాయల రుణమాఫీ చేయాలి*
== ఇటీవలే కురిసిన అకాల వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వాళే*
== రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
== రైతులకు జరుగుతున్న అన్యాయాల ను నిరసిస్తూ ఈ నెల 20 న కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యములో మెగా రక్త దాన శిబిరం
== కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
(ములుగు-విజయం న్యూస్)
రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నియోజక వర్గ కో ఆర్డినేటర్ గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్య కర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఇది కూడా చదవండి:- అకాల వర్షాలతో నీటిపాలైన పంటలు: సీతక్క
1200 మంది ప్రాణ త్యాగాలను చూసి చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే వచ్చిన తెలంగాణ లో కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ రైతులను మోసం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రం లో ఉంది అమ్మ పోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లు ఉంది రైతుల దుస్థితి రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్య మంత్రి కెసిఆర్ గారు రైతు ఆత్మ హత్యాల్లో దేశం లోనే రెండవ స్థానం లో ఉన్నాం అని సీతక్క అన్నారు.
ఇది కూడా చదవండి:- పాదయాత్ర లో డప్పు దరువేసిన సీతక్క
ఈ నెల 20 న రైతులకు జరుగుతున్న అన్యాయలను నిరసిస్తూ ములుగు లో చేపడుతున్న మెగా రక్త దానం శిబిరం నిర్వహించడం జరుగుతుంది అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచిన పరిస్థితి ఉందని ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ఎన్నికల సమయం లో ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తాం అని మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన కెసిఆర్ గడిచిన తొమ్మిదిన్నర యేండ్ల నుండి రుణమాఫీ చేయలేదు అని రైతు రుణమాఫీ లేదు పంట నష్ట పరిహారం లేదు పండించిన పంటలను కొనడం లేదు పండించిన పంట కు గిట్టు బాటు ధర లేదు
ఇన్ ఫుడ్ సబ్సిడీ లేదు కల్తీ ఎరువులు, పురుగు మందులు కల్తీ విత్తనాలు ఇలా అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యాహరిస్తింది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి:- అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి
గడిచిన తొమ్మిదిన్నర యేండ్ల కాలంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులను అధుకున్న పాపాన పోలేదు ఆత్మ హత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
రైతు ప్రభుత్వం రావాలంటే రైతును రాజును చేయాలంటే కాంగ్రెస్ అధికారం లోకి రావాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి
ఈ నెల 20 న ములుగు నియోజక వర్గం లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మెగా రక్త దానం శిబిరం విజయవంతం చేయాలని కార్య కర్తలకు నాయకులు పిలుపునిచ్చారు
ఇది కూడా చదవండి:- ఔటర్ రింగ్రోడ్డులో భారీకుంభకోణం: రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నియోజక వర్గ కో ఆర్డినేటర్ గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్
మండల ఉపాధ్యక్షులు అర్షం రఘు,పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్, జిల్లా నాయకులు చింత నిప్పుల భిక్షపతి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్,మాజీ ఎంపీటీసీ ఇమ్మడి రాజు యాదవ్,జిల్లా నాయకులు ల్యాద శ్యామ్ రావు, ల్యాద శ్యామ్ రావు
కవ్వం పెల్లి సారయ్య,కొండల్ రెడ్డి,ఓరుగంటి అనీల్,కృష్ణ
తో పాటు తదితరులు ఉన్నారు