?పశువులను తరలిస్తున్నా కంటైనర్ వాహనం బోల్తా
?15 పశువులు మృతి, మరో 10 పశువులు ప్రాణ స్థితిలో
(ఇచ్చోడ విజయం న్యూస్) :
ఇచ్చోడ మండలంలోని సాత్ నంబర్ గ్రామాంలోని జాతీయ రహదారిపై అక్రమంగా పశువులను తరలిస్తున్నా కంటైనర్ లారీ బోల్తా పడింది. కంటైనర్ లారీ లో సుమారు 70 కి పైగా పశువులను కుక్కి తీసుకవెళ్తున్నారు. 15 పైగా మూగ జీవాలు ఈ ప్రమాదంలో మృతి చెందాయి. మిగితా 10 పశువులు ప్రాణ స్థితిలో ఉన్నాయి. సాత్ నంబర్ గ్రామా యూత్ సభ్యులు బ్రతికి ఉన్న పశువులను ఆ వాహనం నుండి సురక్షితంగా బయటకు తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వహవాన్ని వదిలి డ్రైవర్ పారిపోయారు.