*ఇద్దరు ఉపాధ్యాయుల మరియు ఒక ఏ ఆర్ కానిస్టేబుల్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య .
*ఇద్దరు ఉపాధ్యాయుల మరియు ఒక ఏ ఆర్ కానిస్టేబుల్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య .
ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి దొబ్బల సౌజన్య అన్నారు. ఆమె మాట్లాడుతూ మహబూబాబాద్ . కామారెడ్డి జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళ ఉపాధ్యాయులు గుండెపోటుతో మరణించారు అంతేకాకుండా ఖమ్మం జిల్లా కు చెందిన ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని అన్నారు.317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
also read :-కూరగాయలతో కేసీఆర్ చిత్రపటం
నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త నియామకాలు చేయకపోగా ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా జిల్లాలను విభజించి ఉపాధ్యాయులను ఉద్యోగులను మారుమూల ప్రాంతాలకు పంపిస్తూ వారి కుటుంబాలలో నిప్పులు పోస్తున్నారని చెప్పారు. భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేయాలనే నిబంధనలు తుంగలోకి తొక్కార ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈనాటి ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లె బోయిన భారతి రఫీ దా బేగం మిక్కిలినేని మంజుల ఏలూరు రజిని మొదలగు మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు
please subscribe this chanel smiling chaithu