Telugu News

 డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ని సన్మానించినా జావిద్

హాజరైన కార్పోరేటర్లు, ఖమ్మం నియోజకవర్గ నాయకులు

0

డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ని సన్నానించిన మహమ్మద్ జావిద్

== హాజరైన కార్పోరేటర్లు, ఖమ్మం నియోజకవర్గ నాయకులు

(ఖమ్మం-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండవసారి నియామకమైన పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కు ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎండి జావిద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో సన్మానం చేశారు.

Allso read:- కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకడు విక్రమార్కుడు: జావిద్

శాలవ, బుక్కీలతో ఘనంగా సన్మానం చేసి, స్వీట్  తినిపించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహ్మద్ జావిద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని అలాగే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని, ఆ విధంగా కృషి చేయాలని, కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, మైనార్టీ, గిరిజన, నియోజవర్గ నాయకులు హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం త‌థ్యం: జావిద్