Telugu News

నేడు తెలంగాణకు ఈసీ బృందం

ఎన్నికల పై సమీక్ష చేయనున్న ఈసీ బృందం

0

నేడు తెలంగాణకు ఈసీ బృందం

==  ఎన్నికల పై సమీక్ష చేయనున్న ఈసీ బృందం

హైదరాబాద్:నవంబర్ 01(విజయం న్యూస్)

కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందం బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ఎన్నికలు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం నేడు తెలంగాణకు రానుంది..

సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది.

ఈసీ బృందం…రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు.

అనంతరం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులతో సమావేశం కానుంది. తనిఖీలు, స్వాధీనాలపై సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల సీఎస్. డీజీపీల, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు తదితర అంశాలపైచర్చిస్తారు……