మంత్రి పువ్వాడ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు..
*▪️సహకరించిన మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు.
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
రఘునాధపాలెం నుండి కోయచలక గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైయెందుకు వెళ్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనాన్ని కోయాచలక క్రాస్ రోడ్ వద్ద ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు.
మంత్రితో పాటు వాహనంలో డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, ఇతర ప్రజా ప్రతినిధులు ఉండగా ఎన్నికల అధికారులు చేపట్టిన తనిఖీలకు వీరు సంపూర్ణంగా సహకరించారు.
ఇది కూడా చదవండి:- అమ్ముడు పోయే సరుకు నాకు అవసరం లేదు: మంత్రి
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున వారి వీధి నిర్వహణలో భాగంగా తనిఖీలు సర్వ సాధారణమే అని, తను ఎప్పుడైన సహకరిస్తానని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.