Telugu News

ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

0

ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

(వాజేడు విజయం న్యూస్):-

ఉపాధి హామీ పనుల్లో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాజేడు సంత పాకల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ రైతు సంఘం నాయకులు సూడి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బైరెడ్డి సాంబశివ హాజరై మాట్లాడుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సుమారు 45 గ్రామాల్లో సర్వేలు నిర్వహించగా అనేక సమస్యలు వెలుగు సూచాయని, అందులో భాగంగా మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో అనేక సమస్యలతో ఉపాధి హామీ కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

also read;-టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ని కలిసిన బాధితులు

ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ బిల్లులు, అదనపు అలవెన్సులు వెంటనే చెల్లించాలని, ఉపాధి హామీ పనులను గుట్టలపై కాకుండా వ్యవసాయ క్షేత్రాల్లో పని కల్పించేలా ఉపాది హామీ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి తాహసిల్దార్ కార్యాలయం ముందు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తాహసిల్దార్ రాహుల్ చంద్ర వర్మకి పలు సమస్యలతో కూడిన మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య, జిల్లా నాయకులు దామోదర్, యువజన సంఘం నాయకులు బచ్చల కృష్ణ బాబు, ఐద్వా నాయకురాలు సౌమ్య, రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గుగ్గిళ్ల దేవయ్య, వాదం చంటి, విజయ్ బాబు, సుధాకర్, భూలక్ష్మి, సీత, నర్సమ్మ , వెంకటస్వామి ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.