పొలాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించారు. రైతులు, కౌలు రైతులు అయిన పంట సాగులో ఉన్న ప్రతి రైతుకు నేరుగా నష్టపరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. పంట నష్టం వివరాల నమోదుకు పాస్ బుక్ అవసరం లేదని, సర్వే నెంబరు, సాగు రైతు బ్యాంకు పాస్ పుస్తకం కావాలని ఆయన తెలిపారు. తమ పంటలు చేతికి వచ్చే దశలో అకాల వర్షం వడగండ్ల వానకు పంట నేలమట్టం అయిందని పూర్తిస్థాయిలో నష్టపోయామని తమను ఆదుకోవాలని రైతులు కలెక్టర్ కు ఆవేదనను వెళ్లబుచ్చారు. సమగ్రంగా సర్వే చేపట్టి పంట నష్టం వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ అధికారులు సర్వే చేపట్టి, ఏ ఒక్క రైతు నష్టపోకుండా నష్ట నివేదికలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, ముదిగొండ మండల తహసీల్దార్ శిరీష, ఎంపీడీఓ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారిణి రాధ, వ్యవసాయ విస్తరణ అధికారిణి మౌనిక, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: చిన్నారులతో ఆత్మీయంగా కలెక్టర్