ప్రజల కోసమే ఇంటింట జ్వర సర్వే : హారీష్ రావు
== తొలి రోజు 12లక్షల మందికి పరీక్షలు చేశాం
== సిద్దిపేటలో ఇంటింటికి జ్వర సర్వేను పరిశీలించిన మంత్రి
(సిద్దిపేట-విజయంన్యూస్)
ప్రజల కోసమే ఇంటింట జ్వర సర్వే నిర్వహిస్తున్నామని, జ్వర లక్షణాలు ఉంటే వారికి వెంటనే జ్వర మందులు, కరోనా లక్షణాలు ఉంటే కరోనా క్విట్ ఇచ్చేందుకు టీమ్స్ ను ఇంటింటికి పంపిస్తున్నామని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈ ఇంటింట జ్వర సర్వేను ప్రజలందరు వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రారంభించిన తొలిరోజే శుక్రవారం 12 లక్షల మందికి పరీక్షలు వైద్యాధికారులు చేశారని, తెలిపారు.
also read :-భారత్లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
శనివారం సిద్ధిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలోని అదరిని టీకా తీసుకున్నారా లేదా అని మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. హోమ్ కిట్ ద్వారా కరోనా లక్షణాలు పోతున్నాయని మంత్రి తెలిపారు. ప్రతిరోజు వారీ ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అన్ని రకాల వైద్యం చేస్తారన్నారు. 5 నుండి 8 వారాలు ఈ సర్వే చేయిస్తారని మంత్రి తెలిపారు. లైన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లను పెంచుతామని హరీష్ రావు పేర్కొన్నారు. మందుల ద్వారా కరోనాను ఎదుర్కొగలిగినప్పటికీ ప్రతి రోజు సర్వే చేస్తున్నాం, నీతి ఆయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వే పట్ల సంతోషం వ్యక్తం చేసిందని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. పిల్లలు కోసం ప్రత్యేక, పెద్దల కోసం ప్రత్యేక వార్డులను లాంఛనంగా ఏర్పాటు చేశామన్నారు.కోటికి పైగా హోమ్ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.
also read :-కరోనా కాలంలో అమ్మకాల్లో డోలో 650 టాబ్లెట్ రికార్డు..!
ప్రతి గ్రామంలో కిట్లను రెడీ చేశాం. ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా ఉంచాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా డాక్టర్లు ఖాళీ లేకుండా ఖాళీలను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి వెల్లడిరచారు. ప్రజలు ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆశా కార్యకర్తలకు సమాచారం అందించి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, దీనివల్ల ఎలాంటి ప్రాణ హాని ఉండదని మంత్రి తెలిపారు. సర్వేలో పాల్గొన్న అధికారులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.