Telugu News

ఖమ్మం నగరంలో ఫీవర్ సర్వే ప్రారంభం

** ఇంటింట తిరుగుతున్న ఆశావర్కర్లు, వైద్యసిబ్బంది

0

ఖమ్మం నగరంలో ఫీవర్ సర్వే ప్రారంభం

** ఇంటింట తిరుగుతున్న ఆశావర్కర్లు, వైద్యసిబ్బంది

ఏ మాత్రం లక్షణాలు కన్పించిన కరోనా టెస్ట్..

** మందుల క్విట్ అందజేత
(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం నగరవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే ప్రారంభమైంది. వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తు, ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలతో పాటు.. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు , గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి వెంటనే టెస్టులు నిర్వహించి.. అప్పటికప్పుడే ఔషధ కిట్లు అందజేస్తున్నారు

also read;-ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్….!?

** ఎప్పటికప్పుడు అప్రమత్తం

ఇటీవల కేబినెట్‌ భేటీలో కరోనా కట్టడి చర్యలపై విస్తృతంగా చర్చించారు. రెండు కోట్ల కొవిడ్‌ కిట్‌లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు. జ్వర సర్వేతో పాటు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఇంటివద్దే ఉంటూ ప్రభుత్వం అందించే కిట్‌లోని మందులను వాడుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.