మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: సంభాని
హాత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమంలో మాజీమంత్రి సంభాని
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: సంభాని
== నిరుద్యోగులకు న్యాయం చేస్తాం
== హాత్ సే హత్ జోడో యాత్ర కార్యక్రమంలో మాజీమంత్రి సంభాని
(సత్తుపల్లి-విజయంన్యూస్)
మొదటి ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేస్తామని మాజీ మంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ హామినిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 47వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా శనివారం తల్లాడ మండలంలోని మాల్సూర్ తండా, రంగం బంజర గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టగా మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటి ఇంటికి తిరుగుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం కాంగ్రెస్ కంచు కోట అని మరోమారు నిరూపించాలి: సంభాని
రాహుల్ గాంధీ సందేశాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్ని ప్రజలకు అందిస్తూ ఈ క్రింది విధంగా మాట్లాడారు. యువత భవిత, అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ విధానం. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉండేందుకే యూత్ డిక్లరేషన్ రూపొందించామని తెలుపుతూ…..మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తామని, ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి చేస్తామన్నారు. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేసి, రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన చేస్తామన్నారు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4000 నిరుద్యోగ భృతి చెల్లింపులుంటాయని, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ చేస్తామన్నారు. 18 ఏళ్లు పైబడిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ప్రతి జిల్లాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 నిరుద్యోగ భృతి ఇస్తాం: సంభాని
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాపా సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ ఎస్సీసెల్ కన్వీనర్ కొండూరు కిరణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, పట్టణ ప్రెసిడెంట్ దగ్గుల నాగిరెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హుస్సేన్ నాయక్, కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తాళ్ళ వెంకటేశ్వర్లు, జిల్లా Sc సెల్ బలవంతపు రవీంద్ర, ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్యా అంజయ్య, కాంగ్రెస్ నాయకులు మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ మువ్వా రోశయ్య, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, కిసాన్ సెల్ ఎర్రి కృష్ణారావు, చలపతి రెడ్డి, భూషణం, జామాల్, నల్లగట్ల శీను, రమేష్ కోసూరి వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, చుక్కా తదితరులు పాల్గొన్నారు.