పోడు రైతులకు హక్కు పత్రాలివ్వండి: భట్టి
== ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
== పోడు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కోరిన సీఎల్పీ
(మంచిర్యాల-విజయంన్యూస్)
పోడు రైతులకు హక్కు పత్రాలను ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో హామిలిచ్చిందని, ఆ హామిలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సీఎల్పీ నేత ఆరోపించారు. పోడు రైతులకు పట్టాలిస్తామని అనేక సార్లు సీఎం కేసీఆర్ హామినిచ్చారని, ఏళ్లు గడుస్తున్నప్పటికి ఇప్పటి వరకు కనీసం కనికరం లేకుండా పోడు రైతుల వైపు చూడను కూడా చూడటం లేదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: రైతు క్షేమమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం: రాయల
ఇంకా ఆయనేమన్నారో.. చూద్దాం..
👉🏿 మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లి గ్రామంలో సోమవారం పాదయాత్రలో లేఖను విడుదల చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
👉🏿 ప్రజాసమస్యలు తెలుసుకునేందుక మార్చి 16 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టాను.
👉🏿 18 రోజులుగా ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తొన్న నాకు వేల మంది గిరిజనులు, ఆదివాసీలు కలిసి వారు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వివరించారు.
👉🏿 కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు పట్టాల భూములను బిఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా హక్కులు కోల్పోయామని, తమ భూముల్లోకి రాకుండా అటవి అధికారులు పెడుతున్న ఇబ్బందులను చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు.
👉🏿 ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గగొండ తదితర జిల్లాల్లో పోడు చేసుకుంటున్న రైతులకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలి.
👉🏿 పోడు పట్టాలపై 2014 నుంచి మీరు, మీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ నీటిమీద రాతలుగా మారాయి.
👉🏿 పోడు భూముల సమస్యలను 2014, 2018 సాధారణ, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో పోడు భూముల సమస్యలను మీరు అస్త్రంగా వాడుకుని గెలిచిన తరువాత మరిచిపోయిన అంశాన్ని గిరిజనులు గుర్తుపెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: ‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి
👉🏿 నాటీ మీ టీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పోడు భూముల అంశాన్ని ప్రస్తావించారు. 2019 మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల సాక్షిగా పోడు భూములు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించారు.
👉🏿 2019 జులై 19న అసెంబ్లీలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చేందుకు అక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటానని ప్రకటించారు.
👉🏿 గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశాల్లో 11.50 లక్షల ఎకరాకలు పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించానరు. ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు గత నెల 9న జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో లక్ష 55 వేల 393 మందికే మొదటి విడతలో హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించారు.
👉🏿 నాలుగు లక్షలమంది గిరిజనలు హక్కు పత్రాల కోసం ఎదురుచూస్తుంటే 1.5 లక్షమందికే పట్టాలిస్తామనడం.. గిరిజనులను నిట్టనిలువునా మోసం చేయడమే.
👉🏿 కేంద్ర అటవి హక్కుల చట్టం ప్రకారం అడవిపై, అటవి ఫలాలపై, పోడు భూములపై గిరిజనులకు పూర్తి హక్కులున్నాయి.
👉🏿 గిరిజనులకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరం
ఇది కూడా చదవండిం రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యతం రద్దు అప్రజాస్వామికం: కాంగ్రెస్
👉🏿 ఎన్ని లక్షల ఎకరాలపై, ఎంత మంది ధరఖాస్తు చేసుకున్నారో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రభుత్వం జాబితాను విడుదల చేయాలి.
👉🏿 పోడు భూముల సమస్యలపై పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి.
👉🏿 పోడుభూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలి
👉🏿 పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయకుంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తుంది.