ఖమ్మం జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
== ఖమ్మం బైపాస్ రోడ్డులో విగ్రహాన్ని అవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
== ఊరూరా ఊరేంగుపులు, ప్రత్యేక పూజలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రామదూత హనుమాన్ కు జై .. జై భజరంగభళి.. జై శ్రీరామ్ అంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ నామస్మరణ మారుమోగింది.. ఏ ఊరిలో, ఏ వాడలో చూసిన జై భజరంగభళి అంటూ భక్తజనం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఊరేగింపులు.. గ్రామసేవలు, అన్నదానాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టిన భక్తులు రోజంతా హనుమంతుడి సేవలో నిమగ్నమైయ్యారు. ఖమ్మం నగరంలో భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని అవిష్కరించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రత్యేకంగా పూజలు చేశారు.
ఇది కూడా చదవండి: 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
అన్నదానం చేశారు.అలాగే జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో జరిగిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు హనుమాన్ జయంతి వేడుకల్లో హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం హనుమాన్ జయంతి పర్వదిన వేడుకలను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అద్భుతంగా భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం నగరంలోని అన్ని హనుమాన్ విగ్రహాల వద్ద వేడుకలు జరిగాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో హిందువులు హనుమాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా అభిషేకాలు, ఆకుపూజ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. హనుమాన్ చాలీసా పారాయణం, హరేరామ..హరే క్రిష్ణ నామ సంకర్తీన ఏకాహం కార్యక్రమాన్ని భక్త భజన మండలి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు.
== బైపాస్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.
అపార కరుణ, అంకితభావానికి ప్రతీక హనుమాన్ జయంతి అని, ఆంజనేయుని ఆశీస్సులు అందరపై ఉండాలని కోరుకుంటున్నానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఖమ్మం పర్ణశాలలోని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమాన్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్ఆర్ నగర్ కాలనీ లోని హజుమన్ జయతి సందర్భంగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం కు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విగ్రహాన్ని మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.
ఇది కూడా చదవండి: పొంగులేటి.. ఊ.. అంటారా..? ఊఊ అంటారా..?
అనంతరం బైపాస్ రోడ్డు 10వ డివిజన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రామ భక్తంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హజరై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి పువ్వాడకు స్వాగతం పలుకగా వేద మంత్రఉచ్చరణలతో అభిషేకం చేసి స్వామి వారి నాభిశిల విగ్రహాన్ని ఆవిష్కరించారు. యాగశాలలో చేపట్టిన యాగఆహుతి, ప్రత్యేక పూజా కార్యక్రమంలోపాల్గొన్నారు. పవిత్ర జలాలు, పంచాంబృతలు, వడమాల, తమలపాకులతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం క్షీరాభిషేకం చేశారు. జై శ్రీ రామ్.. జై శ్రీ రామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.. 30వేల మంది భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహాఅన్నదానం ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హనుమంతుని జీవితం, ఆదర్శభావాలు మనకు ఎల్లవేళలా స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. సంకట విమోచనుడు అందరి కష్టాలను తొలగించి, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రజలందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నా అన్నారు.ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల నుంచి బయట పడి, ఆయురారోగ్యాలతో ఉండాలని హనుమంతుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేటర్ చావా మాధురి నారాయణ రావు అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మయోర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ లు సరిపుడి రమాదేవి సతీశ్, రవి, పగడాల నాగరాజు, దేవబక్తుని కిషోర్ బాబు, గొల్లపూడి రాంప్రసాద్, షకీన, ఏచ్చు ప్రసాద్, సురేష్, మోహన్ తదితరులు ఉన్నారు.