వణికిస్తున్న చలిపులి
** తెలుగు రాష్ట్రాలలో చలి పంజా
** పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు..
** కనిపించని రోడ్లు.. వాహనాలు..
(హైదరాబాద్-విజయం న్యూస్)
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. చలి కాలం పూర్తిగా రాకముందే.. పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు ఆవహిస్తోంది.
తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటలు అయినప్పటికీ మంచు తేరుకోవడం లేదు. దీంతో.. మంచు తెరల మధ్య సూర్యుడు.. పున్నమి చంద్రుడులా దర్శనమిస్తున్నాడు.
మరోవైపు.. పొగ మంచు కారణంగా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కన్పించని పరిస్థితి నెలకొంటోంది.
తెల్లవారుజాము నుంచే భారీగా మంచు కురుస్తోంది. దీంతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.
రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రయాణాలు చేయాలంటేనే వెనకాడుతున్నారు.