Telugu News

నేను రైతు పక్షమే..రైతుల కష్టాలు తెలుసు: నామా

ఆయిల్ ఫామ్ రైతులకు ఎంపీ నామ భరోసా

0
నేను రైతు పక్షమే..రైతుల కష్టాలు తెలుసు: నామా
➡️ ఆయిల్ ఫామ్ రైతులకు ఎంపీ నామ భరోసా
➡️ సమస్యలపై కేంద్రంతో చర్చిస్తా
➡️ హైదరాబాద్ లో ఎంపీ నామ నాగేశ్వరరావు ను కలసి, ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై చర్చించి, లేఖ అందజేసిన తెలంగాణా ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులుహైదరాబాద్ / ఖమ్మం, జూన్ 09(విజయంన్యూస్):

 గిట్టుబాటు ధరకు సంబంధించి  తెలంగాణా ఆయిల్ ఫామ్ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసికెళ్ళి  పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని  బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ రైతు ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. తెలంగాణా ఆయిల్ ఫామ్ రైతుల పక్షాన తెలంగాణా ఆయిల్ ఫామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్  ఆధ్వర్యంలో    శుక్రవారం  ఆయిల్ ఫామ్ రైతు ప్రతినిధులు హైదరాబాద్ లో ఎంపీ నామ నాగేశ్వరరావు ను కలసి, ఆయిల్ ఫామ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, ఓ లేఖ అందజేశారు.వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావదానంగా విన్న ఎంపీ వాటి పరిష్కారానికి ఇప్పటికే పలు విడతలుగా కేంద్రం దృష్టికి తీసికెళ్లడం జరిగిందని అన్నారు.
మళ్లీ కేంద్రం తో మాట్లాడతానని చెప్పారు. ఉత్పత్తి వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి, గిట్టుబాటు ధర పడిపోవడంతో ఆయిల్ ఫామ్ రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని రైతు ప్రతినిధులు ఈ సందర్భంగా ఎంపీ నామ దృష్టికి తీసికెళ్లారు. అయితే తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర రైతులను ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు మంచి ప్రోత్సాహాన్నందిస్తూ రైతులకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదే  సందర్భంలో ఆయిల్‌ పామ్ ,  ఇతర నూనె గింజల రైతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న క్రూడ్ పామ్ ఆయిల్ ( సీపీవో ) యొక్క సుంకం రహిత దిగుమతి గురించి నామ దృష్టికి తీసు కొచ్చారు.ఎఫ్‌ఎఫ్‌బీ ధర 2022 మే నెలలో టన్నుకు రూ. 23,635/- తగ్గిందన్నారు. సెప్టెంబరు 2022 నాటికి రూ. 13,000/ – కు ధరలు తగ్గిన ఫలితంగా తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. 2019-20లో 49 శాతం ఉన్న దిగుమతి సుంకాలు ఏప్రిల్ 2022 నాటికి జీరో చేయ బడ్డాయని, దీనికి తోడు  ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పాటు ధరలు భారీగా తగ్గినప్పటికీ దేశీయ రైతులను రక్షించడానికి ఎటువంటి దిగుమతి సుంకాలు విధించబడలేదని రైతు ప్రతినిధులు నామకు తెలిపారు.  సీపీవో  ధర కోసం దిగుమతి సుంకాన్ని కొనసాగించాలన్నారు.రూ. 1,20,000/-  ద్వారా ఆయిల్ పామ్ ,  ఇతర నూనెగింజల పంటల సాగు ఖర్చు కవర్ చేయబడుతుందని చెప్పారుదిగుమతి సుంకాలను నియంత్రించడానికి,  దేశీయ రైతులను అనవసరమైన విదేశీ పోటీ నుండి రక్షించడానికి “డైనమిక్ ఇంపోర్ట్ డ్యూటీ మెకానిజం”ను  రూపొందిం చేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని నామను కోరారు.
    ఆయిల్‌పామ్ పంటను ప్రవేశపెట్టిన సమయంలో  లాభదాయకమైన ధరను అందజేస్తామని  కేంద్ర ప్రభుత్వం  హామీ ఇచ్చి, తర్వాత  విస్మరించిందని అన్నారు. దీని వల్ల  ఆయిల్‌ పామ్ రైతులు చాలా నిరాశ చెందుతున్నారని రైతు ప్రతినిధులు నామతో అన్నారు  ఈ 32 సంవత్సరాలలో, ధర పడి పోయిన  కారణంగా భారత దేశంలోని రైతులు 1,20,000 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ తోటలను తొలగించారన్నారు. భారత దేశంలోని రైతులు ఇండో నేషియా, మలేషి యాలోని అటవీ తోటలతో పోటీ పడే పరిస్థితి లేదన్నారు. 2017 సంవత్స రంలో, ఆయిల్‌పామ్ రైతులు సీఏసీపీ కి ప్రాతినిధ్యం వహించి ఆయిల్‌పామ్ సాగు ఖర్చుకు సంబంధించి ప్రెష్ ఫ్రూట్ బంచెస్ ( ఎఫ్ఎఫ్ బి )   ప్రతి టన్ను కు  13,000 చెల్లించేలా అంగీకరించిం దన్నారు. కానీ ఇప్పుడు ఎరువులు,  ఇతర ఇన్‌పుట్ ఖర్చులు 100 శాతం  పైగా పెరిగాయని,   ఎఫ్ఎఫ్ బి  యొక్క ప్రతి టన్నుకు  ఉత్పత్తి వ్యయం రూ. 19,000 లు దాకా పెరిగిందని చెప్పారు.అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆచరణీయ ధర సూత్రంలో గింజల విలువను కలిగి ఉండదని, రైతుల వాటాల విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు గురించి, నామ దృష్టికి తీసుకొచ్చారు.ఇందుకు సంబంధించి కేంద్రం తీసు కొచ్చిన  జీవో వల్ల తెలంగాణ రైతులకు తీవ్ర నష్ట దాయ కమని చెప్పి, తాము కేంద్రం ఇచ్చిన జీవోను  వ్యతి రేకించినట్లు చెప్పారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ ( ఎన్ ఎంఇఓ – ఓపి)  కింద 2021-22 మధ్య కాలంలో  ఆమోదించ బడిన  ప్రకారం, భారత ప్రభుత్వం ఇప్పుడు  ఎఫ్‌ఎఫ్‌బి ధరను టన్ను రూ. 13,346 లుగా చేసిందని తెలిపారు.
ఈ ధర  01.11. 2022 నుండి 31.10.2023 వరకు అమలులో ఉంటుంద న్నారు.అయితే  కేంద్ర ప్రభు త్వంతో  ఎంవోయూపై  సంతకం చేసిన రాష్ట్రాలకు మాత్రమే ఈ వయ బిలిటీ ధర చెల్లింపు వర్తిస్తుంద  వివరించారు.మన రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతులకు నష్టం వాటిల్లుతుండడంతో తెలంగాణా ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన ఈ ఫార్ములాను వ్యతిరేకించి, ఎంవోయూ కు అంగీకరించలేదని రైతు ప్రతినిధులు నామకు వివ రించారు. ఎంపీ నామను కలసిన వారిలో రైతు నాయ కులు బండి భాస్కర్ తదిత రులు ఉన్నారు.