Telugu News

‘సత్తుపల్లి’ లో అక్రమ మట్టి మాఫియా

చోద్యం చూస్తున్న రెవెన్యూ , పోలీస్ అధికారులు

0

‘సత్తుపల్లి’ లో అక్రమ మట్టి మాఫియా 

== చోద్యం చూస్తున్న రెవెన్యూ , పోలీస్ అధికారులు

== సింగరేణి పరిధిలో మట్టి తరలిస్తున్నపట్టించుకోని సింగరేణి అధికారులు

== రాజకీయ నాయకులు అండదండలతో అక్రమంగా మట్టి తరలింపు ..?

== ప్రభుత్వ ఉపాధ్యాయుడై పేరు వినపడుతుంది

== పగటిపూట నామమాత్రం గా రాత్రి సమయాలలో గట్టిగా మట్టి తరలింపు

== మైనింగ్ క్వారీలును తలపించేలా పెద్ద పెద్ద మట్టి క్వారీలును పదుల సంఖ్యలో ఏర్పాటు చేసుకుని మట్టి తరలింపు

(సత్తుపల్లి-విజయంన్యూస్)
సత్తుపల్లి మండల పరిధిలోని కొమ్మేపల్లి, లింగపాలెం, కిష్టారం, రెవిన్యూ సరిహద్దు ప్రాంతం నుంచి వందలాది టిప్పులు అక్రమంగా మట్టి తరలిస్తున్న రెవెన్యూ , స్థానిక పోలీస్ శాఖ అధికారులు, అటు వైపు కన్నెత్తి చూడలేకపోవటం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇది కూడా చదవండి: సత్తుపల్లిలో తోటి విద్యార్థికి  విద్యార్థుల చేయూత

సింగరేణి పరిధిలోని ప్రాంతమైన కొమ్మేపల్లి ,లింగపాలెం, సింగరేణి సంస్థ నుంచి నష్టపరిహారం పొందిన కొమ్మేపల్లి, లింగపాలెం రెవెన్యూ పరిధి లో వ్యవసాయ వ్యవసాయ భూమిని రైతులు వద్ద నుంచి సింగరేణి సేకరించినప్పటికీ, కొంతమంది రైతులకు సింగరేణి పరిహారం అందజేసి మరి కొంతమంది రైతులకు జాప్యం చేయటంతో ఆ రెవిన్యూ పరిధిలోని స్థానిక రైతులకు, మట్టి మాఫియా, డబ్బులను ఆశగా చూపి, ఎలాగో సింగరేణి పరిహారం మీకు అందుతుంది కదా, దానికి తోడు నీకు ఎంతో కొంత డబ్బు మూట్ట చెబుతామని ఆశ చూపి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు, స్థానిక రైతులు వాపోతున్నారు, ఆ రెవెన్యూ పరిధిలోని ప్రత్యేకమైన రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకొని రాత్రి పగలు తేడా లేకుండా వందలాది టిప్పుల మట్టి తరలిస్తున్న రెవిన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వారి అసమర్థతను స్థానిక ప్రజలు బేజారు వేసుకుంటున్నారు, మట్టి తరలింపు పై దిశ దినపత్రిక పలు సంచలన కథనాలు ప్రచురించిన తర్వాత రెండు మూడు రోజులు నిలుపుదల చేసి మరల యధావిధిగా వందలాది టిప్పుల మట్టి తరలించేందుకు మట్టి మాఫియా సిద్ధమయ్యారని చెప్పవచ్చు.

ఇదికూడా చదవండి: పొంగులేటి వర్గంలో ‘పాలేరు’ అభ్యర్థి ఎవరు..?

రెవిన్యూ పోలీస్ అధికారుల అండదండలతో పాటు స్థానిక ప్రముఖ రాజకీయ నాయకులను పేర్లు వాడుకొని స్థానిక అధికారులను మధ్యలో పెడుతున్నట్లు మాకు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడు తెలుసు మేము దగ్గర బంధువులు మేము ఫలానా నాయకులకు చాలా దగ్గర బంధువులను అని అధికారులను మభ్యపెడుతున్నట్లు, అధికారులు పలుమార్లు ఉచ్చరించటం శోషనీయం, మట్టి మాఫియాకు వెనుక ఉండి ఈ తంతంతా నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం, కోమ్మేపల్లి పరిధి నుంచి సింగరేణి జిఎం కార్యాలయం మీదుగా సత్తుపల్లి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు నుంచి పదుల సంఖ్యలో టిప్పర్లు మట్టి తరలిస్తున్న రెవెన్యూ అధికారులు కంటికి కనపడకుండా లేదనటం విశేషం, రెవిన్యూ పోలీస్ అధికారుల అండదండలతోనే మట్టి మాఫియా వేల సంఖ్యల తిప్పుల మట్టిని తరలిస్తున్నట్లు, బేతుపల్లి, తాళ్లమడ రెవిన్యూ పరిధిలోని వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ భూమి గా మార్చేందుకు వందలాది లారీలతో వేలాది టిప్పులు మట్టి తరలిస్తున్న అధికారులు మొద్దు నిద్ర వీడం లేదు, పదుల సంఖ్యలో టిప్పర్లను సత్తుపల్లిలో అధిక స్పీడ్ తో తోలుతూ గతంలో రెండు మూడు పర్యాయములు సత్తుపల్లి పట్టణంలో ప్రమాదాలకు కారణమైన కానీ అధికారులు వీరి తీరని పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నడిరోడ్డుపై మంత్రి ఏం చేశారంటే..?

మట్టి మాఫియా మట్టిని తరలించే టిప్పర్లకు సరైన పత్రాలు, తోపాటు డ్రైవర్లకు లైసెన్స్ లేదని ఆంధ్ర పర్మిట్ తో తెలంగాణలో నడుపుతున్నట్లు స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు, కొమ్మేపల్లి ,లింగపాలెం, రెవిన్యూ పరిధిలోని వ్యవసాయ చేసుకున్న రైతులు మట్టి మాఫియా భారీ నుండి మమ్మును మా పంటలను కాపాడాలని వేడుకుంటున్నాను, ప్రభుత్వ ఉపాధ్యాయుడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి మట్టి మాఫియా తో చేతులు కలిపి తెర వెనక నుండి ఈ తంతంతా నడిపిస్తున్నట్లు సత్తుపల్లి ప్రజలు నుంచి వినపడుతుంది, సత్తుపల్లి ప్రజానీకం ఉపాధ్యాయుడు తీరు చూసి స్థానిక ప్రజలు విషమయం వ్యక్తం చేస్తున్నారు, స్థానిక రెవెన్యూ, పోలీస్, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారులు స్పందించి వీరిపై కఠినమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలతో పాటు వివిధ గ్రామాల రెవిన్యూ పరిధిలోని రైతులు వేడుకుంటున్నారు……