Telugu News

పచ్చదనం పెంచటంలో ప్రతీ ఒక్కరిదీ బాధ్యతే : వనజీవి రామయ్య

పచ్చదనం పెంచటంలో ప్రతీ ఒక్కరిదీ బాధ్యతే : వనజీవి రామయ్య

0

పచ్చదనం పెంచటంలో ప్రతీ ఒక్కరిదీ బాధ్యతే : వనజీవి రామయ్య
పచ్చదనం పెంచటంలో ప్రతీ ఒక్కరిదీ బాధ్యతే : వనజీవి రామయ్య
 హరితనిధికి నా వంతుగా స్వయంగా పెంచిన ఎర్రచందనం చెట్లను అటవీ శాఖకు బదిలీచేస్తాను
 ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసిన సందర్భంగా పద్మ శ్రీ వనజీవి రామయ్య
 రామయ్య ఆరోగ్యంపై ఆరా తీసిన ఎంపీ
(ఖమ్మం-విజయంన్యూస్)
ప్రతి ఒక్కరు పచ్చదనం పెంచడంలో బాధ్యత వహించాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పద్మశ్రీ వనజీవి రామయ్య సూచించారు. గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం చాలా సంతోషాన్నిచ్చిందని, ఇది ఒక మంచి కార్యక్రమని వనజీవి రామయ్య ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు. అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ, వనాలు పెంచుతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య ప్రగతి భవన్ లో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను కలిశారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు.

also read :-జూలూరుపాడు మండలం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

దేశమంతా పచ్చబడాలని హరిత సంకల్పంతో మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా రామయ్య దంపతులు ఆకాంక్షించారు. వారికి పాదాభివందంనం చేసి సంతోష్ కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం మన ముందు ఉన్న సవాల్ పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే అని, అందుకు పరిష్కారం ఉన్న అడవులు కాపాడుతూ, కొత్తగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచటమే అని రామయ్య అన్నారు. హరితనిధికి తన వంతుగా స్వయంగా నాటి పెద్ద చేసిన 20 టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం తమ బాధ్యతగా తీసుకోవాలని కోనియాడారు.

also read :-కూసుమంచి మండల పరిషత్ లో కరోనా కలకలం
వనజీవి రామయ్య మాకు ఆదర్శం : సంతోష్ కుమార్
ఏడు పదుల వయస్సులోనూ నిత్య ఉత్సాహంతో పర్యావరణ కృషి చేస్తున్న రామయ్య మా అందరికి అదర్శమని, ఆయన చేస్తున్న వన రక్షణ సేవ వర్ణించలేనిదని అన్నారు. వనజీవి రామయ్య దంపతులను కలవటం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రామయ్య ఆరోగ్య పరిస్థితిపై సంతోష్ కుమార్ ఆరా తీశారు. ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలని, తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. రామయ్య నాటేందుకు, పంపిణీకి అవసరమైన మొక్కలను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున అందించేందుకు ఎంపీ సంసిద్దత తెలిపారు. వనజీవి రామయ్య చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజశేఖర్ గౌడ్ దంపతులు హాజరైయ్యారు.