Telugu News

రేపే తుమ్మల జాయినింగ్

అపాయింట్ మెంట్ ఖారారు చేసిన సోనియాగాంధీ

0

రేపే తుమ్మల జాయినింగ్

== సమయం ఖారారు చేసిన సోనియాగాంధీ

== సోనియా, రాహుల్ సమక్షంలో చేరిక

== 17న ముఖ్యనాయకులు సభ వేదిక పై చేరిక

== తుమ్మల క్యాంఫ్ లో సంబరాలు.. పాత కాంగ్రెస్ లో కనిపించని జోష్

== పదిహేను రోజుల ముందే చెప్పిన విజయం పత్రిక

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అందుకు గాను ముహుర్తం ఖారారైంది.. హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఈనెల 16న ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరే విషయాన్న రెండు తేదిలను సోనియాగాంధీ ముందు ఉంచగా, ఆమె 16న మధ్యాహ్నం 12.45 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: తుమ్మల ఇంటికి ఠాక్రే

దీంతో ఆ సమయానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు సాధు రమేష్ రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, బండి జగదీష్ లు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ,  రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆ తరువాత కొద్ది సేపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎందుకు పార్టీలో చేరారో వివరించే అవకాశం ఉంది.

== 17న క్యాడర్ మొత్తం సభా వేదిక చేరే అవకాశం

తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో ఈనెల 16న  సోనియాగాంధీ, రాహులు గాంధీ సమక్షంలో చేరుతుండగా, ఆయన క్యాడర్, నాయకత్వం మొత్తం ఈనెల 17న హైదరాబాద్ లోని తుక్కగూడెలో జరిగే విజయభేరి సభ లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలోని  అగ్రనాయకత్వం, ఎంపీపీ, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యానాయకులు, టీడీపీ పార్టీలోని మరికొంత మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను ఈనెల 17న భారీగా సుమారు 500 వాహనాల్లో హైదరాబాద్ కు తరలివెళ్లే అవకాశం ఉన్నట్లు తుమ్మల అనుచరులు చెబుతున్నారు. ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరుతుండటంతో తుమ్మల వర్గీయులు సంబరాలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టపాసులు కాల్చారు. కాగా పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రస్తుతం పాలేరు సీటును అశిస్తున్న ఆశావాహులు, వారి అనుచరుల్లో మాత్రం అసంత్రుప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.. తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరితే ఆయన వర్గీయులకే పెద్ద పీట ఉంటుంది. మనకు వెనకబేంచి అవకాశం ఉంటుందేమో, ఇన్నేళ్లు పార్టీని నడిపించిన, కష్టకాలంలో అండగా ఉంటూ వచ్చిన నాయకుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తుమ్మల  చేరికు అప్పుడే..?