Telugu News

===కెసిఆర్‌ది అసలైన తెలంగాణ భాష: మంత్రి హారీష్ రావు

== దమ్ముంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించు

0

===కెసిఆర్‌ది అసలైన తెలంగాణ భాష: మంత్రి హారీష్ రావు
== దమ్ముంటే ప్రాజెక్టుకు జాతీయ హోదా తెప్పించు
== కిషన్‌రెడ్డిపై మండిపడ్డ మంత్రి హరీష్‌ రావు
==(హైదరాబాద్‌-విజయంన్యూస్):-
తెలంగాణ ఏర్పాటును కేంద్రమంత్రి అమిత్‌ షా బ్లాక్‌ డే అన్నారని మంత్రి హరీశ్‌ రావు గుర్తు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి కేసీఆర్‌ గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల వాడుక భాషనే కేసీఆర్‌ మాట్లాడతారన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే భాష బీజేపీదని, కేసీఆర్‌ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సొల్లు పురాణం వద్దని, చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని హరీశ్‌ రావు సూచించారు.

also read :-***నేలకొండపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్‌ పెంచాలని, అది జరగాలంటే రాజ్యాంగం మార్చాలనడం తప్పా అని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టు, ఐఐఎం, ఐఐటీ ఇవ్వమని కిషన్‌ రెడ్డి ఎందుకు అడగడం లేదని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ఏ విషయంలోనూ కేంద్రం నుంచి రాష్టాన్రికి మద్దతు లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను విమర్శించడం సరికాదు.. దమ్ముంటే తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా తీసుకురా అని కిషన్‌ రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రజలు బానిస సంకెళ్లను బద్దలు కొట్టి ప్రత్యేక రాష్టాన్న్రి సాధించారు. దేశ ప్రజలను ఇవాళ బీజేపీ నాయకులు బానిసలుగా చూస్తున్నారు. బానిసత్వానికి వ్యతిరేకమైన కేసీఆర్‌ను విమర్శించడం సరికాదు. ప్రజలు బీజేపీని నమ్మే స్థితిలో లేరు. కిషన్‌ రెడ్డికి దమ్ముంటే.. తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇప్పించాలి.

also read :-రామానుజచార్య విగ్రహాన్ని దర్శించిన ఎమ్మెల్యే కందాళ

అప్పుడు మేం వచ్చి ఎయిర్‌పోర్టులోనే ఆయనకు దండలు వేస్తాం. నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ సస్యశ్యామలం అవుతదని కిషన్‌ రెడ్డి అంటున్నారు. గోదావరి నీళ్లను కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నాకు, పెన్నా నుంచి
కావేరికి నీళ్లను తీసుకుపోతామని అంటున్నారు. తెలంగాణ నీళ్లను కర్ణాటకు, తమిళనాడుకు తీసుకుపోతే మనం సమర్థించాలటా? అసలు కిషన్‌ రెడ్డి ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. తెలంగాణ భూభాగానికి సరిపోయిన నీళ్లను కేటాయించిన తర్వాతే మిగతా రాష్టాల్రకు తీసుకెళ్లాలి అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి లేదు అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన భాషే కేసీఆర్‌ ఇవాళ మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల భాషను కేసీఆర్‌ మాట్లాడుతారు. విూది మతాల మధ్య చిచ్చు పెట్టే భాష. మతాల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టే భాష విూది. కేసీఆర్‌ది ప్రజల భాష, సామాన్య ప్రజల భాష, ప్లలెల్లో రైతులు మాట్లాడుకునే భాష అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కిషన్‌ రెడ్డికి అమరవీరుల గురించి మాట్లాడే అర్హత లేదు. అమరవీరుల స్థూపం కూడా తాకే అర్హత ఆయనకు లేదు. కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఢల్లీిని కూకటివేళ్లతో కదిలించి తెలంగాణను సాధించారు. సీమాంధ్ర నాయకులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారు. ఎంతో మంది తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. కిషన్‌ రెడ్డి రాజీనామా చేయకుండా పదవిని పట్టుకున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలేదు. జై ఆంధ్రా ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని,, 2011, డిసెంబర్‌ 8న కిషన్‌ రెడ్డి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ట్వీట్‌ చేశారు. రాజీనామా చేయకుండా ముఖం చాటేసి.. ఇవాళ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు.

also read :-==ఆదాయ వనరులను పెంపొందించాలి : సండ్ర

తెలంగాణ సమాజానికి వెన్నుపోటు పొడిచారు. యెండల లక్ష్మీనారాయణను గెలిపించుకునే పరిస్థితి నీకు లేదు. సొంత పార్టీ కాకపోయినా తెలంగాణ కోసం కేసీఆర్‌ యెండలను గెలిపించారు. అమరుల గురించి మాట్లాడే నైతికత కిషన్‌ రెడ్డికి లేదు అని హరీశ్‌రావు అన్నారు.
తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ కేంద్ర మంత్రివి అయ్యావు. 2019, ఆగస్టు 6న ఆర్టికల్‌ 370 విూద చర్చ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అమిత్‌ షా అడ్డగోలుగా మాట్లాడారు. విద్వేషాన్ని చిమ్మారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బ్లాక్‌ డేగా వర్ణిస్తే.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్‌ రెడ్డి బల్లలు చరిచారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ దెబ్బతీసే విధంగా మాట్టాడితే కిషన్‌ రెడ్డి బల్లలు చరిచారు. మా చరిత్రను కించపరిచేలా మాట్లాడుతున్నావు అని మోదీని, అమిత్‌ షాను ఏనాడూ కిషన్‌ రెడ్డి నిలదీయలేదు అని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా కిషన్‌ రెడ్డి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఎఫ్‌సీఐకి బడ్జెట్‌లో రూ. 65 వేల కోట్లు కోత పెట్టారని కేసీఆర్‌ అడిగారు. ఉపాధి హావిూకి రూ. 25 వేల కోట్లు తగ్గించారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్‌ పెరగాలని కేసీఆర్‌ కోరారు. హైదరాబాద్‌కు వరదలు వస్తే కేంద్రం నుంచి నిధులు ఏమైనా విూరు ఇప్పించారా? తెలంగాణకు ఒక్క ట్రిపుల్‌ ఐటీ ఇవ్వలేదు. రాష్టాన్రికి ఒక్క ప్రాజెక్టు అయినా విూరు తెచ్చారా? మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 364 కోట్లు ఇచ్చింది. విూరు ఇచ్చింది కేవలం రూ. 2.5 కోట్లు మాత్రమే. వీటన్నింటిపై కిషన్‌ రెడ్డి సమాధానం చెప్పాలి. పేదల కడుపుకొట్టి గద్దలకు పంచి పెడుతున్నారు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.